కడ్తాల్ : అందరూ కలిసికట్టుగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని కర్కల్పహాడ్ గ్రామంలో టీఆర్ఎస్ జిల్లా నాయకుడు వెంకోబా తల్లి మల్లేపల్లి సుశీల జ్ఞాపకార్థం రూ. 20లక్షల వ్యయంతో నిర్మిస్తున్న గ్రామ ముఖద్వారానికి జడ్పీటీసీ దశరథ్నాయక్, సర్పంచ్ నాగమణీ, ఎంపీటీసీ లచ్చిరాంనాయక్తో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశానికి గ్రామాలు, పల్లెలే పట్టుకొమ్మలని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాలు, తండాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు కొత్త కళను సంతరించుకున్నాయని చెప్పారు. గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ప్రతి ఒక్కరూ భాగాస్వాములు కావాలని ఆయన కోరారు.
అనంతరం కర్కల్పహాడ్ గ్రామానికి చెందిన కృష్ణయ్యకి రూ. 28వేలు, మాడ్గుల్ మండలం పల్గుతండాకి చెందిన రాముకి రూ. 42వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, యాదయ్య, పూజ, ఎంపీటీసీ కుమార్, ఉప సర్పంచ్ జయమ్మ, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ వీరయ్య, నాయకులు పంత్యానాయక్, శ్రీనివాస్ పాల్గొన్నారు.