కడ్తాల్ : మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తున్నదని, అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని గుర్లకుంట చెరువులో జడ్పీటీసీ దశరథ్నాయక్, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహరెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్రెడ్డి, మత్స్యశాక ఏడీ సుకీర్తితో కలిసి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సకాలంలో సమృద్ధిగా కుర్షాలు కురుస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో గ్రామాల్లోని చెరువులు, కుంటలు పూర్తిగా నిండి అలుగు పారుతున్నాయన్నారు. కుల, చేతి వృత్తులను ప్రభుత్వం ప్రొత్సాహిస్తున్నదని, మత్స్యకారులు ఆర్థికంగా బలపడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుందన్నారు.
సమైక్య రాష్ట్రంలో మసకబారిన కులవృత్తులకు పూర్వవైభవం తీసుకవరావడానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలోని చెరువులు, కుంటల్లో చేప పిల్లలను వదులుతామని, మండలంలో 31 చెరువులు, కుంటల్లో 6,30,000ల చేప పిల్లలను వదులుతున్నట్లు ఆయన చెప్పారు. అదే విధంగా మండల కేంద్రంలో ముదిరాజ్, కురుమ, వడ్డెర, గీతా కార్మికుల భవనాలకు రూ. 5లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ముదిరాజ్లకు త్వరలో ప్రభుత్వం మోపెడ్లను పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే వివరించారు.
ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, జడ్పీటీసీ విజితారెడ్డి, సర్పంచ్ హరిచంద్నాయక్, ఉప సర్పంచ్లు రామకృష్ణ, అనిల్యాదవ్, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షుడు పరమేశ్, వెంకటేశ్, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ వీరయ్య, నాయకులు చందోజీ, గంప శ్రీను, పాండునాయక్, రాంచంద్రయ్య, ఇర్షాద్, రాఘవేందర్, అంజయ్య, శంకర్, బాలయ్య, సత్యనారాయణ, వెంకటయ్య, మహేశ్, శ్రీశైలం, శేఖర్, గణేశ్, మత్స్యశాఖ ఫీల్డ్ అసిస్టెంట్ యేసుదాసు, ఎఫ్ఏ అంబేద్కర్, ఫిషర్మెన్స్ యాదగిరి, మహేందర్ పాల్గొన్నారు.