కడ్తాల్ : మండలంలోని మైసిగండి మైసమ్మ అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆదివారం సెలవు కావడంతో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క సతీమణీ భట్టి నందిని అమ్మవారికి బోనం సమర్పించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఆమెను పూలమాల, శాలువతో సత్కారించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో స్నేహలత, టీపీసీసీ సభ్యుడు శ్రీనివాస్గౌడ్, ఆలయ నిర్వాహకులు, భక్తులు ఉన్నారు.