కడ్తాల్ : మండల పరిధిలోని మైసిగండి మైసమ్మతల్లి ఆలయానికి సంబంధించిన హుండీ ఆదాయాన్ని బుధవారం జిల్లా దేవాదాయశాఖ అధికారులు లెక్కించారు. దేవాదాయశాఖ జిల్లా ఇన్స్పెక్టర్ ప్రణీత్కుమార్ సమక్షంలో అమ్మ వారి హుండీ లెక్కింపు నిర్వహించగా, 74 రోజులకు సంబంధించిన ఆదాయం రూ. 11,43,769 వచ్చిన్నట్లు ఆలయ ఈవో స్నేహలత, ట్రస్ట్ చైర్మన్ శిరోలీ తెలిపారు. హుండీలో వచ్చిన మొత్తాన్ని కడ్తాల్ మండల కేంద్రంలోని కెనరాబ్యాంక్లో జమ చేస్తున్నట్లు వారు తెలిపారు.
కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ ట్రస్టీ రమావత్ శిరోలీ, ఆలయ నిర్వాహకులు ఆర్పీ భాస్కర్నాయక్, అరుణ్కుమార్, ఆలయసిబ్బంది యాదగిరిస్వామి, బోడియ్యనాయక్, కృష్ణ, రాములు, చంద్రయ్య, దేవేందర్, రమాదేవి పాల్గొన్నారు.