కడ్తాల్ : ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శనివారం హైదరాబాద్లోని తన నివాసంలో లబ్ధిదారులకు స్థానిక నాయకులతో కలిసి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. మండల పరిధిలోని ఏక్వాయిపల్లి గ్రామానికి చెందిన స్రవంతికి రూ. 30 వేలు, వెల్దండ మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన దివ్యకి రూ. 16 వేలు, అంతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సుగుణకి రూ. 40వేలు సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయని తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పథకం నిరుపేదలకు వరంలా మారిందన్నారు. ఈ పథకంతో నిరుపేదలకు కార్పొరేట్ దవఖానల్లో అత్యుత్తమ వైద్య సేవలు అందుతున్నాయన్నారు. పేద ప్రజల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, నాయకులు శ్రీనివాస్రెడ్డి, జైపాల్నాయక్, గోపాల్నాయక్, శ్రీనివాస్, కరుణాకర్రెడ్డి, తిరుపతి, శంకర్, రమేశ్ పాల్గొన్నారు.