కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని ముద్విన్ గ్రామానికి చెందిన జంగయ్యకి రూ. 22,500లు, బుచ్చయ్యకి రూ. 21వేలు, మాడ్గుల్ మండలం ఏంజీ కాలనీ తండాకి చెందిన శ్రీనునాయక్కి రూ. 24వేలు, వెంకటాపూర్ తండాకి చెందిన రమేశ్కి రూ. 16వేలు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు మంజూరయ్యాయి. ఆదివారం హైదరాబాద్లోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకందరికీ వరంలా మారిందని తెలిపారు.
ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు. కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో మాడ్గుల్ వైస్ ఎంపీపీ శంకర్నాయక్, ముద్విన్ సర్పంచ్ యాదయ్య, నాయకులు జంగయ్య, శ్రీను, సుధీర్గౌడ్, ప్రశాంత్, లచ్చిరాంనాయక్, రాజునాయక్ పాల్గొన్నారు.