కడ్తాల్ : పోడు భూముల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. పోడు భూముల సమస్యలపై శనివారం కడ్తాల్ మండలానికి చెందిన 60 గిరిజన కుటుంబాలు జడ్పీటీసీ దశరథ్నాయక్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఎమ్మెల్యేని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ మండలంలోని దాదాపు 150 ఎకరాల పోడు భూములను, గత నలభై ఏండ్ల నుంచి గిరిజన కుటుంబాలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇప్పించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యేను కోరినట్లు జడ్పీటీసీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోడు భూములకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని, గిరిజనులకు పట్టాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
నియోజకవర్గంలోని పోడు భూముల వివరాలను అధికారులు సేకరిస్తున్నారని, ప్రభుత్వానికి నివేదికలు అందజేసి త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, కొండ్రిగానిబోడు తండా సర్పంచ్లు హరిచంద్నాయక్, సేవ్యాబావోజీ, నాయకులు పాల్గొన్నారు.