తాండూరురూరల్, నవంబర్ 7 : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో మంగళవారం చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన అనేక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులు, బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన పింఛన్, రైతుబంధు పెంపు, రూ.400లకే గ్యాస్ సిలిండర్, తదితర హామీలకు ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరుతున్నట్లు పలువురు పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పైలట్ రోహిత్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని తాం డూరు మండలం, చెంగోల్ గ్రామ యువకులు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఎమ్మెల్యే రోహిత్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్లేశ్వరీగౌడ్, వేణుగౌడ్, మాజీ ఉపసర్పంచ్ వెంకటయ్య ఉన్నారు.
తట్టేపల్లి గ్రామంలో..
పెద్దేముల్ : ఎమ్మెల్యే రోహిత్రెడ్డి సమక్షంలో మండల పరిధిలోని తట్టేపల్లి గ్రామానికి చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో మంగళవారం చేరారు. అదే విధంగా అదే గ్రామానికి చెందిన శివాజీ యువజన సంఘం సభ్యులు పలువురు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్లో చేరిన వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పెద్దేముల్ సొసైటీ చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్రెడ్డి, అంజయ్య, నారాయణగౌడ్, ఖదీర్, లక్ష్మణ్, నరేశ్రెడ్డి, మహమ్మద్శిబ్లి పాల్గొన్నారు.
తెలంగాణలో ప్రతిపక్షాలకు స్థానం లేదు
తెలంగాణలో ప్రతి పక్షాలకు స్థానం లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మన్సాన్పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీల నుంచి దాదాపు 100 మంది బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రాఘవేందర్రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతో తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలకు స్థానం లేదని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ సహకారంతో మహేశ్వరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు జాన్రెడ్డి, ఆంజనేయులు గౌడ్, మల్లారెడ్డి యువకులు పాల్గొన్నారు.
జడ్పీ చైర్పర్సన్ ఆధ్వర్యంలో..
మహేశ్వరంలో బీఆర్ఎస్కు తిరుగులేదని జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డి అన్నారు. మంగళవారం సిరిగిరిపురం గ్రామానికి చెందిన నాయీబ్రాహ్మణ సంఘానికి చెందిన నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజునాయక్, నియోజకవర్గం ఉపాధ్యక్షుడు చంద్రయ్య, యూత్ అధ్యక్షుడు శ్రీను, రాములు, కరుణాకర్, నర్సింహ, ఆంజనేయులు పాల్గొన్నారు.
అందరి చూపు.. బీఆర్ఎస్ వైపు
అందరి చూపు.. బీఆర్ఎస్ వైపు కొనసాగుతుందని, బీఆర్ఎస్లో భారీగా చేరుతున్నట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలో నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలం అంతారం గ్రామ సర్పంచ్ శ్రీకాంత్రెడ్డి, రామకృష్ణారెడ్డి ఏఎంసీ డైరెక్టర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నరోత్తంరెడ్డి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీతోపాటు ఇతరత్రా పార్టీల కార్యకర్తలు, అదేవిధంగా పట్టణంలోని గాంధీనగర్ వీధికి చెందిన మహిళలు బస్సమ్మ, ఆశమ్మ, పద్మ, తిరుపతమ్మ, సరోజ, పద్మమ్మ, అంజమ్మ, మొగులమ్మ, అనంతమ్మ, అనసూయ, అంజమ్మ, బుచ్చమ్మ, లలితమ్మ, యాదమ్మ, కపీరమ్మ, నర్సమ్మ, ఆశమ్మ, రేణుక, ఎల్లమ్మ, కవిత, అనంతమ్మ, స్వరూప, లక్ష్మి, నిరుమల, అరుణ తదితరులు ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.