కడ్తాల్ : మండల పరిధిలోని రేఖ్యాతండా పంచాయతీలోని ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహించిన నర్సింహమూర్తి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు. ఆలిండియ క్రిస్టియన్ ఫెడరేషన్ వారు గురువారం సికింద్రాబాద్లోని అమృతవాణి సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 2020-21 సంవత్సరానికిగానూ, విద్యలో విశేష సేవలందించిన నర్సింహమూర్తిని ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేశారు. కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి చేతులమీదుగా నర్సింహమూర్తి అవార్డు అందుకున్నారు. అనంతరం ఆయనను పూలమాల, శాలువతో సన్మానించి మెమోంటోను, ప్రశంసాపత్రాన్ని అందజేశారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, సర్పంచ్ హరిచంద్నాయక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పరమేశ్, రైతుబంధు సమితి మండల కో-ఆర్డిననేటర్ వీరయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ సేవ్యానాయక్ పాల్గొన్నారు.