వెల్దండ, నవంబర్ 13: మండల పరిధిలోని పెద్దాపూర్ గ్రామ పంచాయతీ వడ్డెరబస్తి వాసులు గులాబీ పార్టీకి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్కు జై కొట్టారు. మంగళవారం పెద్దాపూర్ వడ్డెర బస్తి కాలనీలోని ఈదమ్మ ఆలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జైపాల్యాదవ్, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి తో బస్తీ వాసులు సమావేశమయ్యారు. మేమంతా కారు వెంటే ప్రయాణిస్తామని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ను గెలిపించుకుంటామని, కేసీఆర్ను మూడోసారి సీఎంను చేస్తామని తీర్మానం చేశారు. అలాగే చెర్కూర్, తిమ్మినోనిపల్లి, పల్గుతండా, లింగారెడ్డిపల్లికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సమక్షంలో పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కండవాలు కప్పి ఆహ్వానించారు. సీఏం కేసీఆర్తోనే తెలంగాణ రాష్ట్రం అన్నివిధాలా అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పుట్టా రాంరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ అనిల్కుమార్, సర్పంచులు వెంకటేశ్వరావు, భక్యా, అంజీనాయక్, కుమార్, అంజయ్య, అడ్వకేట్ ఆనంద్రెడ్డి, చొక్కన్నపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఆనంద్, నిరంజన్, రాము, రంగయ్య, వెంకటయ్య, శంకర్, దేవెందర్, శేఖర్, మల్లయ్య, బాలు, జైపాల్నాయక్, గోపాల్ నాయక్, ఉప సర్పంచ్ నర్సింహ, రాజు, యాదయ్య, పెద్దయ్యయాదవ్ ఉన్నారు.
ప్రచారం ముమ్మరం..
వెల్దండ మండల కేంద్రంతో పాటు కొట్ర, ఉబ్బలగట్టుతండా, తిమ్మినోనిపల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జైపాల్యాదవ్కు మద్దతుగా మంగళవారం నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రజలతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలు పంచి పెట్టారు. హోటళ్లు, దుకాణాదారులను కలిసి కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. ప్రజల సంక్షేమాభివృద్ధి కోసం జైపాల్యాదవ్ను భారీ మెజార్టీతో గెలుపించుకుందామని పిలుపునిచ్చారు. కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామన్నారు. వెల్దండ మండలం చౌదర్పల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ నిరంజన్, యాదగిరి, ఆనంద్, శంకర్, ప్రభాకర్, కృపానందం, రాము, అర్జున్, శేఖర్, రవి, బాలరాజు, చంద్రశేఖర్, వెంకటయ్య, ప్రసాద్, ఈదులపల్లి శ్రీనివాసులు, శ్రీకాంత్, రాజు, శివ, వెంకటయ్య, వెంకట్ముదిరాజ్, ఎంఎస్గౌడ్, నిరంజన్గౌడ్, మల్లయ్య, బాలకృష్ణ, సాయిలు, పర్వతాలు గౌడ్, బుజ్జీసాజ్యానాయక్, రాజు, యాదయ్య పాల్గొన్నారు.
కడ్తాల్ మండలంలో…
కడ్తాల్, నవంబర్ 13: బీఆర్ఎస్ పార్టీతోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని, ఎన్నికల్లో జైపాల్యాదవ్ను ఆశీర్వదించాలని జెడ్పీటీసీ దశరథ్నాయక్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పరమేశ్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని పల్లెచెల్కతండా గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నాయకులు ప్రారంభించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటేయాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గిరిజన తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని తెలిపారు. సమైక్యాంధ్రలో తండాలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. కాంగ్రెస్ నాయకులు గిరిజనులను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకున్నాయని విమర్శించారు. సీఎం కేసీఆర్ పాలనలో తండాలకు బీటీ రోడ్లు, మంచి నీటి సౌకర్యం, వీధిలైట్లు, డ్రైనేజీ వ్యవస్థ తదితర పనులు జరిగాయని వివరించారు. జైపాల్యాదవ్ ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, వైస్ ఎంపీపీ ఆనంద్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు శ్రీనివాస్రెడ్డి, మండలాధ్యక్షుడు వీరయ్య, సర్పంచ్లు లక్ష్మీనర్సింహారెడ్డి, లోకేశ్నాయక్, భారతమ్మ, యాదయ్య, ఎంపీటీసీ లచ్చిరాంనాయక్, మాజీ ఉప సర్పంచ్ నవీన్, నాయకులు గంప శ్రీను, బీచ్చానాయక్, మధు, బీమ్లా, రాజు, నర్సింహాగౌడ్, జంగయ్యగౌడ్, గోపాల్, నరేశ్, రాజు, శ్రీను, మహేశ్, దాసు, రామకృష్ణ, రాజేశ్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరిన క్యూబా తండాకు వాసులు
ఆమనగల్లు (మాడ్గుల), నవంబర్ 13: రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మడం లేదని, ఆ పార్టీలకు నవంబర్ 30న ఓటుతో బుద్ధి చెప్పడం ఖాయమని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. హైదరాబాద్లోని ఎమ్మెల్యే నివాసంలో సోమవారం మాడ్గుల మండలం క్యుబా తండాకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఏమిరెడ్డి జైపాల్రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఏమిరెడ్డి జైపాల్రెడ్డి ఉన్నారు.