పరిగి, జూన్ 5: విద్యారంగం అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, తల్లి దం డ్రులు తమ పిల్లలను సర్కారు బడులలో చేర్పించాలని ఎమ్మెల్యే మహేశ్రెడ్డి సూచిం చారు. సోమవారం పరిగి మండలం మిట్టకోడూర్ గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడి బాటలో జిల్లా విద్యాధికారి రేణుకాదేవితో కలిసి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పి.ఆకాశ్ను ఎమ్మెల్యే పాఠశాలలో చేర్పించారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను సర్కారు బడులలో చేర్పించి చక్కటి విద్య అందేలా చూడా లన్నారు. విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు ప్రభుత్వం అంది స్తున్నదన్నారు. ఉచితంగా యూనిఫారం అందించడంతోపాటు సన్నబియ్యంతో కూడిన మధ్యా హ్న భోజనం ఉంటుందన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా అన్ని పాఠశాలల్లో సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. శిక్షణ పొందిన ఉపా ధ్యాయు లతో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన అందుతుందని, విద్యార్థులు చక్కటి ఫలి తాలు సాధిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కరణం అరవిందరావు, పీఏసీఎస్ చైర్మ న్ కొప్పుల శ్యాంసుందర్రెడ్డి, సర్పంచ్ విజయలక్ష్మి, ఎంఈవో హరిశ్చందర్ పాల్గొన్నారు.
కార్యకర్తలకు అండగా ఉంటాం
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే మహేశ్రెడ్డి తెలిపారు. పరిగి మండలం మిట్టకోడూర్ గ్రామానికి చెందిన బీఆర్ ఎస్ కార్యకర్త కాకి ప్రభు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా ఆయన భార్య సుమి త్రకు బీమా కింద రూ.2లక్షలు చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి కార్యకర్తకూ అండగా నిలిచేందుకు పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ రూ.2లక్షలు బీమా సదుపాయం కల్పి స్తున్నారని తెలిపారు. ప్రతి కార్యకర్త బీఆర్ఎస్ కుటుంబసభ్యులన్నారు. కాకి ప్రభు పిల్లల చదువుల నిమిత్తం వారికి సహాయం అంది స్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే స్వగృహంలో ఎమ్మెల్యే మహేశ్రెడ్డి సోమవారం పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. శ్రీలతకు రూ.లక్ష, సత్యమ్మకు రూ.21వేలు, అంత య్యకు రూ.7వేలకు సంబంధించిన సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎమ్మెల్యే అందజేశారు.