రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నేడు కొడంగల్కు రానున్నారు. బీఆర్ఎస్ కొడంగల్ ఎమ్మెల్యే అభ్యర్థి పట్నం నరేందర్రెడ్డికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు కొడంగల్లో రోడ్ షోలో పాల్గొని ప్రసంగించనున్నారు. నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని రూ.2 వేల కోట్ల నిధులతో అభివృద్ధి చేసిన మంత్రి కేటీఆర్ రానుండడంతో అపూర్వ స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు.
– వికారాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, నవంబర్ 8,(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నేడు కొడంగల్లో పర్యటించనున్నారు. కొడంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్రెడ్డికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. నేడు సాయంత్రం 5 గంటలకు కొడంగల్లో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించి మాట్లాడనున్నారు. కొడంగల్లో కేటీఆర్ పర్యటన దృష్ట్యా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. దత్తత నియోజకవర్గం కొడంగల్కు కేటీఆర్ రానుండడంతో పార్టీ నాయకులు, శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు.
మారిన కొడంగల్ ముఖచిత్రం.
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దత్తత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. కొడంగల్ నియోజకవర్గాన్ని మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్న నాటి నుంచి కొడంగల్ నియోజకవర్గంలో కనీవినీ ఎరుగని అభివృద్ధి జరిగింది. రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కొడంగల్ను దత్తత తీసుకొని, సిరిసిల్లలా అభివృద్ధిలోకి తీసుకువస్తానని గత ఎన్నికల సమయంలో కొడంగల్ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు దత్తత నియోజకవర్గాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకువచ్చేందుకు అవసరమైన నిధులిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపడంతో కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ప్రభుత్వ హయాంలో రూ.2వేల కోట్లకుపైగా నిధులు మంజూరు చేయించి దత్తత నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు.
పట్టణ, పల్లె దవాఖానలు, చెక్డ్యాంలు, ప్రభుత్వ దవాఖానలు, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీలు, మినీ ట్యాంక్బండ్, గురుకుల పాఠశాలలు, బస్ డిపో, బస్స్టేషన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. నియోజకవర్గంలోని కోస్గి ప్రజల కలను సీఎం కేసీఆర్ నెరవేర్చి కోస్గిలో బస్డిపోతోపాటు బస్స్టేషన్ నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చారు. కొడంగల్, కోస్గి మున్సిపాలిటీల అభివృద్ధికిగాను అధిక ప్రాధాన్యతనిచ్చి మున్సిపాలిటీల అభివృద్ధికి ఇచ్చిన రూ.80 కోట్ల నిధులతో రెండు మున్సిపాలిటీల్లో అండర్ డ్రైనేజీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు సీసీ రోడ్లు, దుకాణ సముదాయాలు, పార్కులు, సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చి సుందరంగా తీర్చిదిద్దారు.
కొడంగల్ మున్సిపాలిటీలో 30 పడకల ప్రభుత్వ దవాఖాన, కోస్గీలో 50 పడకలు, మద్దూరులో 30 పడకల దవాఖానతోపాటు కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో డయాలసిస్ కేంద్రాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చి కొడంగల్ ప్రజలకు ఖరీదైన వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నది. నియోజకవర్గంలోని బొంరాసుపేటలో బీసీ గురకుల, కొడంగల్లో మైనార్టీ గురుకుల, మద్దూరులో ఎస్సీ గురుకుల పాఠశాలలను మంజూరు చేసి పేద విద్యార్థులకు ఉచిత నాణ్యమైన విద్యనందిస్తూ ఏటా ఒక్కొ విద్యార్థికి రూ.లక్షన్నర ఖర్చు చేస్తుంది. అన్ని కులాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ రూ.4 కోట్లతో కొడంగల్, కోస్గిలో యాదవ భవనాలు, ముదిరాజ్ భవనాలు, అంబేద్కర్ భవన్, రూ.కోటిన్నరతో కొడంగల్లో బంజారాభవన్ను నిర్మించి గిరిజనులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.