ఆమనగల్లు, నవంబర్1 :శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 5న మధ్యాహ్నం 2 గంటలకు ఆమనగల్లులో నిర్వహించే భారీ బహిరంగ సభకు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారకరామారావు రానున్నట్లు ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. బుధవారం ఆమనగల్లులో సభ నిర్వహించనున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణాన్ని రాష్ట్ర పుడ్ కమిషన్ చైర్మన్, ఎన్నికల ఇన్చార్జి గోలీ శ్రీనివాస్రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని 7 మండలాలు, 2 మున్సిపాలిటీల నుంచి దాదాపు 50 వేల మంది పాల్గొంటారని తెలిపారు.
సుమారు 1000 మంది వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో కేటీఆర్ సమక్షంలో చేరుతారన్నారు. నియోజకవర్గంలోని కొంత మంది నాయకులు డబ్బులకు ఆశపడి పార్టీ మారారని.. కార్యకర్తలు పార్టీ మారలేదని తెలిపారు.
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. రాబోయే ఎలక్షన్లో విపక్ష పార్టీలకు తగిన గుణపాఠం చెప్పటం ఖాయమన్నారు. నవంబర్ మూడవ వారంలో కల్వకుర్తిలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
కార్యక్రమంలో కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ సత్యం, ఏఎంసీ వైస్ చైర్మన్ గిరియాదవ్, వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, రై.స.స అధ్యక్షుడు నారాయణ, బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు అర్జున్రావు, పత్యానాయక్, ఎంపీటీసీ కుమార్, కార్యనిర్వాహక అధ్యక్షుడు నిరంజన్గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్, ఖలీల్, జహంగీర్, శంకర్, అల్లాజీ, సాయిలు, ఏఎంసీ డైరెక్టర్లు సుభాష్, రమేశ్నాయక్, పరమేశ్, కృష్ణ, యువజన విభాగం నాయకులు ఎనుమల్ల రమేశ్, ప్రసాద్, కిరణ్, సతీష్, విక్రం, కంబాలపల్లి రమేశ్, రంజిత్, రామలింగం, హైమద్, జంగయ్య, ప్రవీణ్, మైసయ్య, వెంకటయ్య, దేవేందర్, వెంకటాపురం శివ, గణేశ్, జంతుక శివ ఉన్నారు.