కడ్తాల్, జనవరి 1 : ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని, సబ్బండ వర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల కేంద్రానికి చెందిన వరికుప్పల జంగమ్మకు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సహకారంతో రూ.2 లక్షల సీఎంఆర్ఎఫ్ (ఎల్వోసీ) చెక్కు మంజూరైంది. ఆదివారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జైపాల్యాదవ్ లబ్ధిదారురాలి కుటుంబ సభ్యుడికి ఎల్వోసీని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్య భద్రతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని, ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్ కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాస్కర్రావు, రాజేందర్, దుర్గయ్య, శంకర్ పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
తుర్కయాంజాల్, జనవరి 1: మున్సిపాలిటీ పరిధి కొహెడకు చెందిన బుడ్డ కిషన్, కృష్ణ, మైలారం నర్సింహ అనారోగ్యంతో ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందారు. వారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే తరఫున ఆదివారం రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ బలదేవరెడ్డి అందజేశారు. కార్యక్రమంలో బుడ్డ విజయ్, మాజీ ఉపసర్పంచ్ బిందు రంగారెడ్డి, నాయకులు ఆంజనేయులు, మానయ్య, ప్రవీణ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.