పరిగి, మార్చి 17 : ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు-రంగారెడ్డి రెండు పథకాల ద్వారా జిల్లాకు సాగునీరు తీసుకొచ్చేందుకు పరిగి ఎమ్మెల్యే, తాను కృషి చేస్తున్నామని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తెలిపారు. ఆదివారం పరిగిలోని ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్పీకర్ మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామన్నారు. పరిగి ప్రాంతం, వికారాబాద్ జిల్లా అభివృద్ధికి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి ప్రత్యేక కృషి చేస్తున్నారని అభినందించారు. ప్రభుత్వం ఎక్కడా తొనకకుండా, బెనకకుండా రాష్ర్టాన్ని ముందుకు తీసుకెళ్తున్నదన్నారు. పరిగి ఎమ్మెల్యే మాట్లాడుతూ వంద రోజుల్లో పరిగి నియోజకవర్గానికి రూ.4770 కోట్లు నిధులు మంజూరు చేయించి అభివృద్ధి వైపు సాగుతున్నామన్నారు. త్వరలోనే ఈ పనులు ప్రారంభం కానున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలలో 80శాతం నెరవేర్చామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు సుధాకర్రెడ్డి, కడుమూరి ఆనందం, పరశురాంరెడ్డి, ఎ.కృష్ణ, చిన్న నర్సింహులు పాల్గొన్నారు.