షాబాద్, అక్టోబర్ 7 : ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ రా ష్ట్రం, రంగారెడ్డి జిల్లా నేడు పారిశ్రామిక ఖిల్లాగా మారిందని, దేశానికి ఆదర్శవంతమై నిలుస్తున్నదని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. శనివారం షాబాద్ మండలంలోని హైతాబాద్, మాచన్పల్లి, మల్లారెడ్డిగూడ, పోలారం గ్రామాల పరిధిలో రూ.8.65కోట్ల నిధులతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి, ఎంపీపీ కోట్ల ప్రశాంతిరెడ్డి తదితరులతో కలిసి శంకుస్థాపనలు చేశారు. అనంతరం అవినాశ్రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మహేందర్రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం సీఎం కేసీఆర్ నేతృత్వంలో దేశానికే దిశ దశ చూపించేలా అభివృద్ధి పథంలో అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నదన్నారు.
షాబాద్ మండలం లో ఏర్పాటవుతున్న పెద్ద పెద్ద పరిశ్రమలతో ప్రపంచ దేశాల చూపంతా షాబాద్ వైపే ఉందన్నారు. త్వరలో శంషాబాద్ నుంచి నాగరగూడ వరకు రోడ్డు విస్తరణ కానున్నదని, ఈ ప్రా ంతం మరింత అభివృద్ధి చెందనున్నట్లు స్పష్టం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతో ఉ మ్మడి రంగారెడ్డి జిల్లాలో 6లక్షల ఎకరాలకు సాగునీరు అందబోతున్నదని తెలిపారు. హైదరాబాద్ విశ్వ నగరంగా ఉనికిని చాటుకుంటే పరిసర ప్రాంతాల్లో పల్లెలు హైదరాబాద్ నగరానికి సమాంతరంగా మౌలిక సదుపాయాలతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయని వివరించారు.
సీఎం అల్పాహార పథకం పేద విద్యార్థుల పాలిట ఒక వరంగా మారుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమ లు చేస్తున్న పథకాలతో ప్రతిపక్షాలు దిమ్మదిరిగి తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని, కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఎవరికి వస్తుందో కూడా తెలియదని, బీజేపీ పార్టీ అసలు ఉనికే లేదని, ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించి బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచి సీఎంగా కేసీఆర్ను, ఎమ్మెల్యేగా కాలె యాదయ్యను మూడోసారి ఆశీర్వదించాలని కోరారు. గత 40 ఏండ్లు గా తమ(పట్నం)కుటుంబానికి రాజకీయంగా ఎదిగేందుకు సహకరిస్తున్న మండల ప్రజలను ఎప్పటికీ మరిచిపోమన్నారు.
ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత మంత్రిగా బాధ్యతలు తీసుకున్న మహేందర్ రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్రెడ్డి కృషితోనే షాబాద్ మండలానికి పెద్ద ఎత్తున కంపెనీలు తీసుకొచ్చి ఈ ప్రాంత రూపురేఖలు మార్చినట్లు తెలిపారు. కంపెనీల్లో ప్రజలకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. సీతారాంపూర్లో ఏర్పాటవుతున్న కిటెక్స్ కంపెనీలో సుమారు 15 వేల మంది వరకు మహిళలకు ఉపాధి లభించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో హ్యాట్రిక్ సాధించనున్న సీఎం కేసీఆర్ తనకు కూడా మూడోసారి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారని, ప్రజలందరూ బీఆర్ఎస్కు ఓటు వేసి తనను ఆశీర్వదించాలని కోరారు.
జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి మాట్లాడుతూ…గ్రామాల్లో పల్లెపల్లెకు అవినాశ్రెడ్డి అనే కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించామన్నారు. హంకుగూడకు రోడ్డు వేయిస్తానని ఇచ్చిన మాట ప్రకారమే రూ.కోటి నిధులతో హంకూగూడ, రూ.2కోట్లలో పోలారానికి, రూ.6కోట్లతో మాచన్పల్లి-పోతుగల్ వరకు బీటీ రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసుకున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీపీ కోట్ల ప్రశాంతిరెడ్డి, వైస్ ఎంపీపీ జడల లక్ష్మి, ఎంపీడీవో అనురాధ, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు నర్సింగ్రావు, శ్రీరాంరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు మల్లేశ్, మహేందర్రెడ్డి, మంగమ్మ, ఇస్మత్బేగం, జంగయ్య, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ చాంద్పాషా, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వెంకటయ్య, శ్రీనివాస్గౌడ్, నర్సింహారెడ్డి, యాదయ్య, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు ప్రభాకర్రెడ్డి, మండల కన్వీనర్ మధుసూదన్రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ యాదయ్య, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మల్లేశ్, హై తాబాద్ మాజీ సర్పంచ్ దర్శన్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు భూపాల్రెడ్డి, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు కవిత, నాయకులు రాజూగౌడ్, సురేశ్గౌడ్, రాజేందర్రెడ్డి, మధుకర్రెడ్డి, గోపాల్, చక్కటి దేవేందర్రెడ్డి, శివకుమార్, పరిగి గణేశ్గౌడ్, శ్రీనివాస్రెడ్డి, గోపాల్నాయక్, రాంచంద్రారెడ్డి, దర్శన్, కృష్ణగౌడ్, మల్లికార్జున్గౌడ్, మునీర్, బల్వంత్రెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్, నరేశ్, బుర్ర రాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.