వికారాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగా ణ): జిల్లాలో పారిశ్రామిక రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం తో కొత్త జిల్లాల్లో మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి. జిల్లాలో ఇప్పటికే శివారెడ్డిపేట, రాకంచర్లలో పారిశ్రామిక కేంద్రాలుండగా.. మ రో రెండు పారిశ్రామిక కేంద్రాల ఏర్పాటుకు సర్కారు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. శివారెడ్డిపేట పారిశ్రామిక కేంద్రంలో ఇప్పటికే పరిశ్రమలు ఏర్పా టు కాగా.. రాకంచర్ల పారిశ్రామిక కేంద్రంలో ఫా ర్మా, రీసైక్లింగ్ పరిశ్రమలు, ఆయిల్ మిల్, పౌల్ట్రీ, పన్నీర్, నెయ్యి తయారీ, తోలు చర్మశుద్ధి పరిశ్రమలు వెలువగా మిగతా పరిశ్రమల ఏర్పాటు ప్ర క్రియ వేగంగా సాగుతున్నది. అదేవిధంగా త్వరలోనే అర్కతల, జిన్గుర్తిలలో ఆహార ఇండస్ట్ట్రియ ల్ పార్కులు అందుబాటులోకి రానున్నాయి. వీటి ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ ప్రక్రి య వేగంగా జరుగుతున్నది. అదేవిధంగా అనుమతులకోసం టీఎస్ ఐపాస్కు ఇప్పటివరకు 1,500లకుపైగా దరఖాస్తులు రాగా ప్రభుత్వం 1,132 దరఖాస్తులకు ఓకే చేపట్టడంతో పరిశ్రమల ఏర్పాటు ప్రక్రియ జోరందుకున్నది. గతం లో ఓ భారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలంటే ఆరునెలల వరకు సమయం పట్టేది.. అనుమతి వస్తుందా..?రాదా అనేది కూడా గ్యారంటీ ఉం డేది కాదు. కానీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్-ఐపాస్ విధానంతో ఎంత భారీ పరిశ్రమ ఏర్పాటుకైనా కేవలం పదిహేను రోజుల్లోనే ప్రభుత్వం అనుమతులను ఇస్తున్నది. అం తేకాకుండా పరిశ్రమలకు 24 గంటలపాటు నిరంతర విద్యుత్ను సరఫరా చేస్తుండటంతో పాటు అవసరమైన మౌలిక వసతులను కూడా కల్పిస్తున్నది. దీంతో దేశ, విదేశాలకు చెందిన బహుళ జాతి సంస్థల నిర్వాహకులు మన రాష్ట్రం లో వారి సంస్థలను ఏర్పాటు చేసేందుకు ముం దుకొస్తున్నారు.
జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుతో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందడంతోపాటు ఎంతోమం ది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తున్నది. జిల్లాలోని చిన్న, మధ్య, భారీ తరహా పరిశ్రమలతో సుమారు 10 వేల మంది ఉపాధి పొందుతున్నారు. అదేవిధంగా కొత్తగా ఏర్పాటుకానున్న ఆహార ఇండస్ట్రియల్కు పార్కులతో మరో 15-20 వేల మందికి ఉపాధి లభించనున్నది. సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్-ఐపాస్తో పారిశ్రామిక రంగానికి నవశకం మొదలైనది. కొత్తగా పరిశ్రమలను ఏర్పాటు చేస్తే ప్రభుత్వం ఆ పరిశ్రమలకు 24 గంటలపాటు విద్యుత్ను సరఫరా చేస్తూ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నది. గతంలో పరిస్థితి దారుణంగా ఉండేది. పగలు రెండు గంటలపాటు, రాత్రి రెండు గంటలపాటు అధికారికంగా పరిశ్రమలకు పవర్ కట్ చేసేవారు. కానీ అనధికారికంగా రోజుకు ఆరేడు గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిపివేసేవారు. గతం లో విద్యుత్ సరఫరా సరిగ్గా లేకపోవడంతో రో జుల తరబడి, ఒక్కోసారి నెలల తరబడి కూడా తమ కంపెనీలను నిర్వాహకులు మూసేకోవాల్సి న పరిస్థితులుండేవి. వేసవి వచ్చిందంటే చాలు చాలా కంపెనీలు పవర్ హాలీడేగా ప్రకటించేవి. దీంతో చాలామంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడేవారు. కానీ ప్రస్తుతం పవర్ కట్కు రోజులు పోయా యి. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగా న్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఇతర రాష్ర్టాల నుంచి విద్యుత్ను కొనుగోలు చేసి పరిశ్రమలకు నిరంతరం సరఫరా చేస్తున్నది.
జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుతో గత ఆరేండ్ల కాలంలో నిర్వాహకులు రూ.1,530 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇందులో సోలార్, పవన విద్యుత్ పరిశ్రమల ఏర్పాటుతో రూ. 1,000 కోట్ల పైచిలుకు పెట్టుబడులు రాగా.. మిగతా చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుతో రూ.500 కోట్లకుపైగా పెట్టుబడులొచ్చాయి. అయితే జిల్లా లో ప్రధానంగా పవర్, ఫార్మా రీసైక్లింగ్, ఐరన్, ప్లాస్టిక్, గ్లాస్, మైనింగ్, పర్యాటక రంగం, విత్తనోత్పత్తి పరిశ్రమలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా జిల్లాలో పవన విద్యుత్ పరిశ్రమలకు సం బంధించి ఇప్పటికే నజీరాబాద్ కేంద్రంగా పవన విద్యుత్తుత్పత్తి కేంద్రం కొనసాగుతుండగా .. మరొక పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పా టు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. జిల్లాలో సోలార్ పవర్ పరిశ్రమను మరిం త అభివృద్ధి చేసే దిశగా అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. ప్రస్తుతం జిల్లాలో మోమిన్పేట, వెల్చల్, పెద్ద ఉమ్మెంతాల్, ఉద్దమర్రి, పీరంపల్లి, కొత్తగడి, నస్కల్, కుమ్మెర, లింగుర్తి ప్రాం తాల్లో సోలార్ పవర్ ఉత్పత్తి కేంద్రాలున్నాయి. అదేవిధంగా మైనింగ్ క్వారీలకు సంబంధించి మర్పల్లి, పెద్దేముల్, కందనెల్లి, ధారూరు, మం బాపూర్, కోట్పల్లి ప్రాంతాల్లో స్టోన్ క్రషర్స్, బెం టోనైట్ పరిశ్రమలున్నాయి. ఇప్పటికే పరిగి, కొడంగల్ మండలాల్లో వరి విత్తనోత్పత్తి కేంద్రాలుండగా కొడంగల్లో మరొక కేంద్రాన్ని ఏర్పా టు చేసేందుకు చర్యలు చేపట్టారు. కాగా ఆహార ఇండస్ట్ట్రియల్ పార్కుల్లో ఆహార శుద్ధి పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నారు.
టీఎస్-ఐపాస్ ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహికులు అధిక సంఖ్యలో ముందుకొస్తున్నారు. గతంలో మాదిరిగా కాకుండా టీఎస్ఐపాస్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి 15 రోజుల్లోగా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తున్నాయి. జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి వేగంగా జరుగుతున్నది. ఆరేండ్లలో జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుతో భారీగా పెట్టుబడులొచ్చాయి.
– నిఖిల, వికారాబాద్ కలెక్టర్