షాబాద్, మే 24: జిల్లాలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు సజావుగా ప్రారంభమైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు. శుక్రవారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షకు రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా మొత్తం 13,886 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 12,472 మంది హాజరయ్యారు.
1,414 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. ఎలాంటి అవాంఛ నీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.