కొత్తూరు, జూలై 14 : అంతరించి పోతున్న అడవులకు పునరుజ్జీవం పోయడం, ఫల, ఔషధ మొక్కలు పెంచి ఆరోగ్యవంతమైన తెలంగాణగా మార్చాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టా రు. ఇప్పటికే చేపట్టిన ఎనిమిది విడుతలు విజయవంతం గా పూర్తయింది. రాష్ర్టాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ ప్రారంభించిన ఈ కార్యక్రమం సత్ఫలితాలను ఇచ్చింది. గత ఎనిమిది విడుతల హరితహారం తో తెలంగాణలోని పల్లెలు, పట్టణాలు పచ్చదనంతో నిం డిపోయాయి. 2023 ఏడాదిలో 19.29 కోట్ల మొక్కలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. అందు లో భాగంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో హరితోత్సవా న్ని నిర్వహించి సీఎం కేసీఆర్ రంగారెడ్డి జిల్లాలోని తుమ్మలూరు అర్బన్ పార్కులో మొక్కను నాటి 9వ విడుత హరితహారాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
కొత్తూరు మండలంలో 40 వేల టార్గెట్
9వ విడుత హరితహారానికి కొత్తూరు మండలం సమాయత్తమవుతున్నది. గత 8 విడుతల్లో టార్గెడ్ పూర్తి చేసిన అధికారులు 9వ విడుతకు సమాయత్తమవుతున్నారు. మండల పరిధిలోని 12 గ్రామ పంచాయతీల్లోని 12 నర్సరీల్లో వివిధ రకాల మొక్కలు పెంచి నాటేందుకు సిద్ధమవుతున్నారు. ఒక్కో నర్సరీలో 10 వేల మొక్కలు పెంచా రు. ప్రజల డిమాండ్కు అనుగుణంగా ఉసిరి, జామ, దానిమ్మ, నిమ్మ, టెకోమా, గన్నేరు, గుల్మహాల్ తదితర పూలు, పండ్లనిచ్చే మొక్కలు పెంచారు. వర్షాలు పడగానే మొక్కలు నాటేందుకు సమాయత్తమవుతున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మూడు వేల మొక్కల వరకు నాటా రు. వర్షాలు కురిస్తే కమ్యూనిటీ ప్లాంటేషన్కు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రభు త్వ స్థలాలు, పార్కులు, వెంచర్లలో 10 శాతం ల్యాండ్లలో మొక్కలు నాటుతామని చెబుతున్నారు.
మున్సిపాలిటీలో 35 వేల మొక్కలు
కొత్తూరు మున్సిపాలిటీని హరిత మున్సిపాలిటీగా మా ర్చేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ధరణి వెంచర్లో ఏర్పాటు చేసిన నర్సరీలో 95 వేల మొక్కలు పంపిణీ చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 12 వార్డులో 35 వేల మొక్కలు నా టేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. అందు లో భాగంగా దశాబ్ది ఉత్సవాల్లో వెయ్యి మొక్కలు నాటా రు. మరో 2 వేల మొక్కలు వివిధ ప్రాంతాల్లో నాటారు. వర్షాలు ప్రారంభం కాగానే మిగతా మొక్కలను నాటుతామని అధికారులు చెబుతున్నారు.
హరిత మండలంగా తీర్చుదిద్దుతాం
కొత్తూరు మండలాన్ని హరితమయంగా తీర్చిదిద్దేందుకు అధికారులు పని చేస్తున్నారు. మండలంలో గతంలో ఎక్కడ చూసిన బోసిపోయిన ఎడారిలా కన్పించేది. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎక్కడి కక్కడ గ్రామాల్లో నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నాం. గ్రామాల్లో ఎవరికి అవసరం ఉన్నా మొక్కలు ఇస్తున్నాం. ప్రతి గ్రామంలో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి ఆహ్లాదంగా మార్చుతున్నాం. కొత్తూరు మండలంలో మొత్తం 40 వేల మొక్కలు నాటేందుకు అధికారుల ఏర్పాట్లు చేస్తున్నారు. అంతే కాకుండా గతంలో నాటిన మొక్కల్లో ఏవైనా ఎండిపోతే రీప్లేస్ చేసేందుకు ప్రాముఖ్యత ఇస్తున్నారు.
– శ్రీలత, జడ్పీటీసీ, కొత్తూరు