షాబాద్, నవంబర్ 2: చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఉద్యమ నేత దేశమళ్ల ఆంజనేయులు గురువారం సొంత గూటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నగరంలోని ప్రగతిభవన్కు ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డితో కలిసి వెళ్లి సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
2001నుంచి పార్టీ అధినేత కేసీఆర్ వెంట తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఆయన 2018లో కాంగ్రెస్లో చేరారు. ఆ పార్టీలో తగిన గుర్తింపు లభించకపోవడంతో తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకోసం పనిచేయాలని, పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని సీఎం తనతో చెప్పినట్లు ఆంజనేయులు తెలిపారు.