కులకచర్ల, ఏప్రిల్ 1 : ఐకేపీ ధ్యానం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకో వా లని సివిల్ సప్లయ్ డీఎం సుగుణాబాయి, డీఎస్వో రాజశ్వేరి అన్నారు. సోమవారం కులకచర్ల మండల కేంద్రంలోని సరస్వతీ శిశుమందిర్లో ఏర్పాటు చేసిన ఐకేపీ ధ్యానం కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మకుండా నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలన్నారు. క్వింటాలుకు ఏ గ్రేడ్ ధాన్యం రూ. 2203, బీ గ్రేడ్ ధాన్యం రూ. 2183 రేటును నిర్ణయించిందన్నారు.
రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకొని నాణ్యతగా కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని అన్నారు. రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని సక్రమంగా కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఎలాంటి అవకతవకలు జరుగకుండా చూడాలన్నారు. ఎప్పటికప్పుడు కొనుగోలు చేసిన ధాన్యానికి ఓపీఎంఎస్ చేసి డబ్బులు వచ్చే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కులకచర్ల ఎంపీడీవో రామకృష్ణనాయక్, డీపీఎం రామ్మూర్తి, ఏపీఎం శోభ, సీసీ వెంకటయ్య, వీవోఏలు, గ్రామ సంఘం అధ్యక్షులు, రైతులు పాల్గొన్నారు.