కడ్తాల్, నవంబర్ 9 : తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, జరుగుతున్న అభివృద్ధి పనులు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. బుధవారం రేఖ్యాతండా, టాక్రాజ్గూడ తండా లో రూ.12 లక్షలతో నిర్మించిన మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్, రూ.12.50 లక్షలతో నిర్మించిన వైకుంఠధామాలను ప్రారంభించారు. రూ.5 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు, రేఖ్యాతండా-సాలార్పూర్ గ్రామాల మధ్య చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా టాక్రాజ్గూడ తండాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాలు, తండాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి గ్రామానికి బీటీ రోడ్డును నిర్మిస్తామన్నా రు. పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు పూర్తిగా మారిపోయాయని తెలిపారు. మిషన్ భగీరథ పథకంతో గ్రామాల్లో శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కారమైందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, సర్పంచ్లు హరిచంద్నాయక్, సులోచన, లక్ష్మీనరసింహారెడ్డి, ఎంపీటీసీలు ప్రియ, మంజుల, గోపాల్, లచ్చిరాంనాయక్, ఉప సర్పంచ్లు సుజాత, గణేశ్, ఏఎంసీ, పీఏసీఎస్ డైరెక్టర్లు నర్సింహాగౌడ్ పాల్గొన్నారు.
సమన్వయంతో పని చేయాలి
మండల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలోని సమావేశం మందిరంలో ఎంపీపీ కమ్లీమోత్యానాయక్ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జైపాల్యాదవ్ హాజరయ్యారు. సభ ప్రారంభం కాగానే ఎంపీటీసీలు, సర్పంచ్లు పలు సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి జడ్పీ నిధులు రూ.14 లక్షలు మంజూరయ్యాయని, అదనంగా రూ.10 లక్షలతో త్వరలో మహిళా సమాఖ్య భవనానికి శంకుస్థాపన చేస్తామని తెలిపారు. మండలంలో అవసరమైన అన్ని గ్రామాల్లో అంగన్వాడీ భవనాలను నిర్మిస్తామన్నారు.
గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మండల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. మండల కేంద్రంలో అన్ని శాఖల కార్యాలయాలకు సొంత భవనాలను నిర్మిస్తామన్నారు. సమావేశంలో జడ్పీటీసీ దశరథ్ నాయక్, వైస్ ఎంపీపీ ఆనంద్, సింగిల్విండో చైర్మన్ వెంకటేశ్, తహసీల్దార్ మురళీకృష్ణ, ఎంపీడీవో రామకృష్ణ, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్, గోపాల్, శ్రీనివాస్రెడ్డి, రాములు, మంజుల, ప్రియ, ఉమావతి, నిర్మలమ్మ, కోఆప్షన్ సభ్యుడు జహంగీర్బాబా, ఎంఈవో సర్దార్, ఆర్అండ్బీ డీఈఈలు తిరుపతిరెడ్డి, రవీంద్రప్రసాద్, ఏవో శ్రీలత, ఏఈలు పరమేశ్, శ్రావ్య, సర్పంచ్లు పాల్గొన్నారు.