కడ్తాల్, మార్చి 21: పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఐసీడీఎస్ సూపర్వైజర్ శబరి అన్నారు. గురువారం మండల పరిధిలోని సాలార్పూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ పక్షంలో భాగంగా, సీమంతాలు, చిన్నారులకు అన్నప్రసాన, చిరుధాన్యాల ప్రాముఖ్యత, రక్తహీనత నివారించుట గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిరుధాన్యాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషకాహారాన్ని మహిళలు తీసుకోవాలన్నారు. చిరుధాన్యాలతో పోషకాలు పుష్కలంగా లభిస్తాయని, మహిళలు, బాలింతలు, రక్తహీనత ఉన్న వారు వాటిని తీసుకోవాలని పేర్కొన్నారు.
అనంతరం ఏ ఊరిలోనూ పోషకలోపం ఉండకూడదనే ఉద్దేశంతో మహిళలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చరిత, అంగన్వాడీ టీచర్లు అంజమ్మ, సంగీత, శోభారాణి, ఆశాలు స్వరూప, లక్ష్మి, అనురూప, పాల్గొన్నారు.
ఆమనగల్లు : పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఐసీడీఎస్ సూపర్వైజర్ పార్వతి అన్నారు. మండలంలోని విఠాయిపల్లి, శంకర్కొండతండాల్లో గురువారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడా (పోషణ పక్షం) కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి సూపర్వైజర్ పార్వతి హాజరై మా ట్లాడుతూ పోషక విలువలు కలిగిన ఆహారాన్ని బాలింతలు, గర్భిణులు తీసుకోవాలన్నారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు రాధమ్మ, జయమ్మ, సుజాత, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.