ఇబ్రహీంపట్నంరూరల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరువతో తెలంగాణ రాష్ట్రంలో రైతురాజ్యం కొనసాగుతుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వహించ తలపెట్టిన రైతుబంధు సంబురాల్లో భాగంగా బుధవారం మండల పరిధిలోని ఉప్పరిగూడ రైతువేధికలో అలంకరణ కార్యక్రమం, రైతుబంధు సంబురాల్లో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రైతాంగమంతా సుభిక్షంగా ఉండాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ పథకం ద్వారా ఏడాదికి ఎకరాకు రూ. 10వేల చొప్పున పెట్టుబడి సహాయం అందజేసి ఆదుకుంటున్నారని అన్నారు.
గత ప్రభుత్వాల హయాంలో వ్యవసాయాన్ని పూర్తిగా మరిచిపోయి వలసలు వెల్లిన రైతులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కృషితో గ్రామాలకు చేరుకుని వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా ఈనెల 10వరకు రైతుబంధు సంబురాలు అంగరంగ వైభవంగా నిర్వహించాలన్నారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాలతో పాటు మున్సిపాలిటీల్లోని రైతులు రైతుబంధు సంబరాల్లో పాల్గొనాలన్నారు. అనంతరం రైతులతో కలిసి స్వీట్లు పంచుకుని ఎమ్మెల్యే సంబురాలు నిర్వహించారు. ఉప్పరిగూడ రైతు వేదికలో పూలతో జై కేసీఆర్, జై రైతుబంధు పేర్లను అందంగా అలంకరించారు. అలాగే, ముకునూరు రైతువేదికలో ఏఈఓ శ్రవన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంబరాలు అంబరాన్నంటాయి.
ఉప్పరిగూడ గ్రామాభివృద్ధికి ప్రత్యేక కృషి..
ఇబ్రహీంపట్నం ఖాల్సా పరిధిలోని సర్వే నంబర్ 1146లోని ఉప్పరిగూడ గ్రామ రైతులకు సంబంధించి 118ఎకరాల భూములకు సంబంధించిన సమస్యను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. రైతులందరు ఒకతాటిపైకి వస్తే ఈ సమస్యను తాను స్వయంగా రెవెన్యూ అధికారులను గ్రామానికి తీసుకువచ్చి దగ్గరుండి పరిష్కరించి రైతులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానన్నారు. అలాగే, గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్ బూడిద రాంరెడ్డి చేస్తున్న కృషి మరువలేనిదన్నారు. అలాగే, గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయడం కోసం రెండులైన్ల రోడ్డును గ్రామం మీదుగా నిర్మించనున్నట్లు తెలిపారు. అలాగే, ఉప్పరిగూడ సమీపంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు ఏర్పాటు చేయించి గ్రామంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.
కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, సర్పంచ్లఫోరం జిల్లా అధ్యక్షుడు బూడిద రాంరెడ్డి, వైస్ఎంపీపీ ప్రతాప్రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వినర్ మొద్దు అంజిరెడ్డి, సహకారసంఘం చైర్మన్ సుదర్శన్రెడ్డి, ఉపసర్పంచ్ నర్సింహారెడ్డి, ఏఓ వరప్రసాద్రెడ్డి, ఏఈఓ రఘు, మండల అధ్యక్షుడు బుగ్గరాములు, టీఆర్ఎస్ నాయకులు కాల్లె గణేష్, జెర్కోని రాజు, పాతూరి రాజేష్, గోపాల్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.