ఇబ్రహీంపట్నం/ ఆదిబట్ల, డిసెంబర్ 9: తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని రాగన్నగూడలో శుక్రవారం సినిమా ఫక్కీలో ఓ యువతిని సుమారు వంద మందితో వచ్చి ఓ వ్యక్తి కిడ్నాప్ చేసిన ఉదంతం సుఖాంతమైంది. కిడ్నాప్ జరిగి న 10 గంటల్లోపే ఆమెను క్షేమంగా రక్షించినట్లు రాచకొండ పోలీసులు తెలిపారు. శుక్రవారం రాత్రి ఆదిబట్ల పోలీస్స్టేషన్లో అదనపు సీపీ సుధీర్బాబు, ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్సింగ్తో కలిసి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్ల డించారు. యువతిని క్షేమంగా రక్షించి కిడ్నాప్నకు పాల్పడిన వారిలో ఎనిమిదిమందిని అదు పులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. అం దులో ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. ఇప్పటికే ఆరు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు తెలిపారు.
రంగంలోకి ప్రత్యేక బృందాలు
రాగన్నగూడ సిరి టౌన్షిప్లో ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి దామోదర్రెడ్డి తమ కుటుంబంతో కలిసి
నివాసం ఉంటున్నాడు. ఆయన కుమార్తె ఓ మెడికల్ కళాశాలలో డాక్టర్గా విధులు నిర్వహిస్తున్నది. కాగా అదే కాలనీలో ఉంటున్న నవీన్రెడ్డి (29)కొంతకాలంగా ఆమెను ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడు. ఇదిలా ఉం డగా యువతి తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇదే క్రమంలో శుక్రవారం ఆ యువతిని చూసేందుకు కొంతమంది బంధువులు ఆమె ఇంటికొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న నవీన్రెడ్డి సుమారు వందమందితో కలి సి ఆరు వాహనాల్లో కర్రలు, మారణాయుధాల తో వచ్చి వారి ఇంటిపై దాడి చేశాడు. అడ్డొచ్చిన యువతి తల్లిదండ్రులు, అక్కడే ఉన్న బంధువులను తీవ్రంగా గాయపర్చారు. ఇంట్లోని వస్తువులను పూర్తిగా ధ్వంసం చేసి యువతిని తీసుకెళ్లా రు. బాధితుల ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వరరావు, ఆదిబట్ల సీఐ నరేందర్ ఘటనాస్థలికి చేరుకున్నారు. కిడ్నాపర్ల కోసం పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు.