యాచారం, అక్టోబర్ 30: సీఎం కేసీఆర్ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం రాష్ట్రంలో తిరిగి కొనసాగాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని చింతపట్ల గ్రామంలో ఆదివారం రాత్రి ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించారు. జంగిరెడ్డి కళాబృందం బీఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలను తమ ఆటాపాటల ద్వారా వివరించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించారు. గొల్ల కురుమలు గొర్రె పిల్లను, మత్య్సకారులు చేపల వలను ఆయనకు బహూకరించారు.
సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే తిరిగి ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే సాధ్యమన్నారు. చింతపట్ల లక్ష్మణ చెరువును అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్కు ఓటేస్తే రాష్ట్ర అభివృద్ధి మరో డబ్బు ఏండ్ల్ల వెనుకకు పోతుందన్నారు. రాష్ట్రంలో అవినీతి పేరుకుపోయి సామాన్య ప్రజల బతుకు భారంగా మారుతుందన్నారు. కాంగ్రెస్, బీజేపీలు తోడుదొంగలని విమర్శించారు.
దళితబంధు విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని, ఇది నిరంతర పక్రియ అని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలు పచ్చి మోసం అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్గౌడ్, ప్రధాన కార్యదర్శి బాషా, బీఆర్ఎస్ నాయకులు తలారి మల్లేశ్, లిక్కి నర్సింహారెడ్డి, సింగారం వెంకటయ్య, లిక్కి గోవర్ధన్రెడ్డి, చంద్రయ్య, లక్ష్మీపతి, నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తుర్కుయాంజాల్ : బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతున్నది. మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నాయకులు ప్రతి రోజు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధి బ్రహ్మణపల్లి, కొహెడలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించారు. మంచిరెడ్డి కిషన్రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మల్లేశ్, జ్యోతి, రైతుబంధు కో ఆర్డినేటర్ కందాళ బలదేవరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మర్రి సంపతీశ్వర్రెడ్డి, కొండ్రు శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : అభివృద్ధి, సంక్షేమం బీఆర్ఎస్కు రెండు కండ్లలాంటివని వైఎస్ ఎంపీపీ మంచిరెడ్డి వెంకటప్రతాప్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఎలిమినేడు గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటువేసి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిని మరోసారి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం అందజేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించారు.మండల పరిధిలోని పోచారం, ఉప్పరిగూడ, దండుమైలారం, ముకునూరు, రాయపోల్, పోల్కంపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
యాచారం : మండలంలో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా కొనసాగుతున్నది. మండలంలోని నల్లవెల్లి, మొగుళ్లవంపు, ధర్మన్నగూడ తదితర గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించారు. రాష్ర్టాభివృద్ధికి సీఎం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. కారు గుర్తుకు ఓటేసి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా మంచిరెడ్డి కిషన్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. బూత్ కన్వీనర్లు, కోకన్వీనర్లు, సభ్యులు బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేయాలన్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఓరుగంటి యాదయ్యగౌడ్, జిల్లా రాములు, మారోజు శ్రీనివాస్, మహ్మద్ కాజా, బర్ల కృష్ణ, బొల్లంపల్లి వెంకటేశ్, పాలకూర్ల లక్ష్మీపతిగౌడ్, కాసాని రవి, ప్రతాప్రెడ్డి తదితరులున్నారు.
ఆదిబట్ల : ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే మంచిరెడ్డి కిషన్రెడ్డిని గెలిపిస్తాయని బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు కొప్పు జంగయ్య అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని మంగల్పల్లి గ్రామంలో ఇంటింటి ప్రచా రం నిర్వహించారు. మరోమారు ఆదరించి గెలిపిస్తే మరిం త అభివృద్ధి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కృష్ణంరాజు, మౌనిక, నాయకులు పాల్గొన్నారు.