ఇబ్రహీంపట్నం : మహాత్మాగాంధీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శనివారం గాంధీజీ జయంతిని పురస్కరించుకుని శేరిగూడలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి, వైస్ చైర్మన్ యాదగిరి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.