తుర్కయాంజాల్, నవంబర్ 2 : ఇబ్రహీంపట్నం గడ్డ మంచిరెడ్డి కిషన్రెడ్డి అడ్డ అని డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి అన్నారు. రాగన్నగూడలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ మున్సిపాలిటీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మంచిరెడ్డి కిషన్రెడ్డి గెలుపు ఖాయమన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు బొక్క రవీందర్రెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కందాడి ముత్యంరెడ్డి, బీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు అమరేందర్రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు అశ్విని, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తుర్కయాంజాల్ : సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరిందని రంగారెడ్డి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అన్నారు.గురువారం మున్సిపాలిటీ పరిధి 10వ వార్డు పరిధిలోని ఎస్సీ కాలనీలో వార్డు ఇన్చార్జి చెవుల దశరథతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలలో ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని వాటిని కూడా అమలు చేసిన చరిత్ర సీఎం కేసీఆర్దేనన్నారు. కారు గుర్తుకు ఓటువేసి గెలిపించాలని కోరారు.
అదేవిధంగా కమ్మగూడ 22వ వార్డు వేంకటేశ్వర నగర్కాలనీ, సాయి ప్రియ కాలనీలో వార్డు ఇన్చార్జి గుండ్ల రాజిరెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధి కొహెడ బీఆర్ఎస్ పార్టీ 5వ వార్డు అధ్యక్షుడు గంగని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సానెం శివశంకర్ గౌడ్ ఆధ్వర్యంలో కొహెడలోని వేణుగోపాల స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ మేతరి అంజయ్య, కుర్మ సంఘం అధ్యక్షుడు వస్పరి బాబయ్య, బీఆర్ఎస్ నాయకులు అర్ల కృష్ణ, దాస్గౌడ్, బాలనర్సింహ, యాదిరెడ్డి, కొత్తకుర్మ శ్రీశైలం, మైలారం బాబు, విజయానంద్రెడ్డి, ధన్రాజ్ పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ను ఎదుర్కొనే సత్తా ఏపార్టీకి లేదని ఎంపీపీ కృపేశ్ అన్నారు. మండల పరిధిలోని రాయపోల్ గ్రామంలో గురువారం బీఆర్ఎస్ కార్యాలయాన్ని పార్టీ మండల అధ్యక్షుడు చిలుకల బుగ్గరాములతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సారథ్యంలో నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందటంతో ప్రజలు బీఆర్ఎస్ను ఆశీర్వదిస్తున్నారని అన్నారు. అధిక మెజార్టీతో గెలిపించటం ఖాయమని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బల్వంత్రెడ్డి, ఎంపీటీసీలు అచ్చన శ్రీశైలం, జ్యోతి, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి భాస్కర్రెడ్డి, నాయకులు బాలు, సుధాకర్గౌడ్, అశోక్గౌడ్, ఈశ్వర్, లక్ష్మణ్, నర్సింహ పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం జోరుగా జరుగుతున్నది. రాయపోల్, దండుమైలారం, మకునూరు, కప్పాడు, ఎలిమినేడు, ఉప్పరిగూడ, తుర్కగూడ, పోచారంతో పాటు పలు గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉప్పరిగూడ గ్రామంలో సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రచారం నిర్వహించగా, రాయపోల్ గ్రామంలో ఎంపీపీ కృపేశ్ ఆధ్వర్యంలో జోరుగా ప్రచారం నిర్వహించారు.
మంచాల : ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డికి మద్దతుగా తాళ్లపల్లి గూడ, చిత్తాపూర్, తిప్పాయిగూడ తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే గెలుపునకు దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సుకన్య, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్రెడ్డి, నాగరాజు గౌడ్, నాయకులు యాదయ్య, మల్లేశ్ పాల్గొన్నారు.
పెద్దఅంబర్పేట : మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 9వ వార్డు పెద్దఅంబర్పేటలోని పలు కాలనీల్లో బీఆర్ఎస్ మున్సిపల్ మాజీ అధ్యక్షుడు కంచర్ల సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డిని గెలిపించాలని ఓటర్లను కోరారు. పార్టీ మ్యానిఫెస్టోను ఇంటింటికీ వివరిస్తూ ముందుకు సాగారు. ఐదో వార్డులో చెరుకూరి జగన్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. 16వ వార్డులో బీఆర్ఎస్ నేత విజయ్భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు సత్తార్, ఇబ్రహీం, గోపాల్గౌడ్, సూరయ్య, భూషణం పాల్గొన్నారు.
ఆదిబట్ల : మంచిరెడ్డి కిషన్రెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదిబట్ల మున్సిపల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కొప్పు జంగయ్య అన్నారు. మంగల్పల్లి, ఆదిబట్ల, కొంగరకలాన్, బొంగులూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. కిషన్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు కొప్పు జంగయ్య తదితరులు పాల్గొన్నారు.