ఇబ్రహీంపట్నంరూరల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేద ప్రజలకు కొండంత అండగా నిలుస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో వివిధ అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా నగరంలోని దవాఖానలో చికిత్స పొంది సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం నుంచి మంజూరైన చెక్కులను శనివారం క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఆదిబట్ల మున్సిపాలిటి కొంగరకలాన్కు చెందిన ఐలమ్మకు రూ. 60వేలు, మౌలాలికి రూ. 26వేలు, సదానందంకు రూ. 25వేలు, పోల్కంపల్లి గ్రామానికి చెందిన మొగిలి గణేష్కు రూ. 60వేలు, గున్గల్ గ్రామానికి చెందిన సుదర్శన్కు రూ. 34వేల చెక్కులను క్యాంపు కార్యాలయంలో అందజేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, పోల్కంపల్లి సర్పంచ్ ఆండాళు, ఎంపీటీసీ మంగతో పాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.