మంచాల, నవంబర్ 8 : మంచాల మండలం ఆరుట్ల గ్రామ సమీపంలో ఉన్న బుగ్గరామలింగేశ్వరస్వామి జాతర మంగళవారం నుంచి ప్రారంభమైంది. ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి స్వామివారికి పూజలు చేశారు. భక్తులు సత్యనారాయణస్వామి వ్రతాలు, కార్తిక దీపాలను వెలిగించి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం సర్పంచ్ విష్ణువర్ధన్రెడ్డి, ఎంపీటీసీ రమేశ్, శ్రీనివాస్, ఉప సర్పంచ్ జంగయ్యగౌడ్ ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మైసిగండి మైసమ్మతల్లి జాతర ప్రారంభం
కడ్తాల్, నవంబర్ 8 : జిల్లాలో ప్రసిద్ధిగాంచిన మైసిగండి మైసమ్మతల్లి జాతర మంగళవారం ప్రారంభమైంది. కార్తిక మాసంలో మైసమ్మ అమ్మవారి ఆలయ ఉత్సవం ఆనవాయితీగా వస్తున్నది. ఉత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకుల వేద మంత్రోచ్ఛరణల మధ్య అమ్మవారికి అభిషేకం, హారతి, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని కొబ్బరి, మామిడాకుల తోరణాలు, వివిధ రకాల పూలు, విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆలయ ట్రస్టీ శిరోలీపంతూనాయక్, ఆలయ ఈవో స్నేహలత, ఆలయ నిర్వాహకులు భాస్కర్నాయక్, అరుణ్కుమార్, ఆలయ సిబ్బంది యాదగిరిస్వామి, బొడియానాయక్, కృష్ణ, చంద్రయ్య, రాములు, రమాదేవి, దేవేందర్, వెంకటేశ్, విజయ్, రామకృష్ణ, శ్రీనివాస్, మహేశ్, కుమారస్వామి, పార్థునాయక్ పాల్గొన్నారు.