తాండూరు, మే 2: తాండూరులోని సమద్ ఫంక్షన్హాల్లో మంగళవారం రాత్రి ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈద్ మిలాప్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజూగౌడ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ పండుగలు మత సామరస్యానికి ప్రతీకలని, తాండూరులో అన్ని మతాల పండుగలను కలిసి కట్టుగా నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ కలిసి మెలిసి పండుగలు జరుపుకోవాలన్నారు.