కందుకూరు, జూలై 13: సీఎం కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చి రైతుల కష్టాలను తొలగిస్తే పీసీసీ అధ్యక్షుడికి కండ్లు మండుతున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నా రు. అందుకే మూడు గంటలపాటు చాలని అనుచిత వ్యా ఖ్యలు చేశారని మండిపడ్డారు. గురువారం పీసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యలను నిరసిస్తూ కందుకూరు మండల కేం ద్రంలో మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ రేవంత్ వ్యాఖ్యలతో కాం గ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకిగా నిరూపితమైందన్నారు. సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నారని .. అయితే వారు బాగుండటం ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇష్టలేదని అం దుకే బోర్లకు మీటర్లు బిగిస్తామని బీజేపీ నాయకులు అంటుంటే.. రైతులకు మూడు గంటల విద్యుత్తును సరఫరా చేస్తామని విదేశాల్లో కాంగ్రెస్ నాయకులు అంటున్నారని ఎద్దేవా చేశారు. ఆ పార్టీలను నమ్మితే మోసపోతారని మంత్రి అన్నదాతలు, ప్రజలకు సూచించారు. గత కాంగ్రెస్ హయాంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో.. పోతుందో తెలియక అన్నదాతలు అరిగోస పడ్డారని గుర్తు చేశారు. రైతుల సమస్యలను స్వయంగా గమనించిన సీఎం కేసీఆర్ వారి ఇబ్బందులను తొలగించేందుకు నిరంతరంగా విద్యుత్తును సరఫరా చేస్తున్నారని కొనియాడారు. ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రం అన్నపూర్ణగా మారిందని.. ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేసే స్థాయికి మనం చేరామన్నారు. ప్రస్తుతం అన్నదాతలు తమ పొలాలను సాగు చేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారన్నారు.
రేవంత్ను ఎయిర్పోర్టు నుంచే తరిమికొట్టాలి
రైతులకు మూడు గంటల విద్యుత్తు చాలని విదేశాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్రెడ్డి రాష్ర్టానికొస్తే ఎయిర్పోర్టు నుంచే తరిమికొట్టాలని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అన్నదాతలు, రైతులకు సూచించారు. కందుకూరులో జరిగిన మహాధర్నాలో పాల్గొన్న ఆయన మా ట్లాడుతూ సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో దేశం మొత్తం ఆయన వైపు చూస్తున్నదన్నారు. అన్నదాతల సమస్యలు స్వయంగా రైతు అయిన ఆయనకు తెలుసున్నారు. మహేశ్వరం గడ్డపై బీఆర్ఎస్ జెండాను మరోసారి ఎగురవేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు సూచించారు. పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. కార్యక్రమంలో రంగారెడ్డి జడ్పీచైర్ పర్సన్ తీగల అనితారెడ్డి, గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్ అయాచితం శ్రీధర్, జడ్పీటీసీ జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్రెడ్డి, రైతు విభా గం అధ్యక్షుడు కృష్ణారాంభూపాల్రెడ్డి, రాఘవేందర్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీల అధ్యక్షులు జయేందర్, రాజూనాయక్, రాంరెడ్డి, నాగేశ్, కామేశ్వర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, పాండు, మాజీ చైర్మన్ ప్రభాకర్రెడ్డి. వైస్ చైర్మన్ విజేందర్రెడ్డి, మేఘనాథ్రెడ్డి, బాలకిషన్, అంజయ్యగౌ డ్, దశరథ, ఈశ్వర్గౌడ్, కొండల్రెడ్డి, రాజశేఖర్రెడ్డి, అమరేందర్రెడ్డి, ఇందిరమ్మ, లావణ్య, జయమ్మ, రా ములు, సామయ్య, కార్త్తిక్, విజ్ఞేశ్వర్రెడ్డి, దీక్షిత్రెడ్డి, ప్రకాశ్రెడ్డి, అంజద్, పుల్లారెడ్డి, రామకృష్ణారెడ్డి, జ్యోతి, గోపాల్రెడ్డి, శ్రీహరి, కుమార్, అంజయ్య, రాజు, నర్సింహ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.