ఇప్పటికే తిరుగులేని శక్తిగా ఎదిగిన బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం.. బలగం చేకూరుతున్నది. రోజురోజుకూ వివిధ పార్టీల నుంచి వలసలు పెరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. రాష్ట్రం రాక ముందు పరిస్థితులు ఎలా ఉన్నాయో.. రాష్ట్రం వచ్చాక ఎలాంటి మార్పు జరిగిందో ఆలోచించాలని అవగాహన కల్పిస్తున్నారు. పట్టులేని, పనిచేయని పార్టీల్లో ఉండి లాభం లేదని, గెలిచే పార్టీ బీఆర్ఎస్లోకి వెళ్లి తాము సైతం అభివృద్ధిలో భాగస్వాములవుదామని ఆయా పార్టీల శ్రేణులు గులాబీ పార్టీలో చేరుతున్నారు. బుధవారం ఆమనగల్లు మండలంలోని పోలేపల్లి కల్యాణమండపంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సమక్షంలో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. కొత్తూరు మండలం ఇన్ముల్నర్వ గ్రామానికి చెందిన పలువురు ప్రతిపక్షాల నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన గ్రామస్తులు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకున్నారు. మర్పల్లి మండలంలోని వీర్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే ఆనంద్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలువడం ఖాయమని, తామంతా సైనికుల్లా కృషి చేస్తామని గులాబీ శ్రేణులు పేర్కొన్నాయి.
ఆమనగల్లు, అక్టోబర్ 11: కల్వకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుపుతానని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నియోజకవర్గాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. బుధవారం మండలంలోని పోలేపల్లి గేట్ దగ్గర ఓ కల్యాణమండపంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే జైపాల్యాదవ్, రాష్ట్ర పుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. అనంతరం పోలేపల్లి, చెన్నంపల్లి, సిం గంపల్లి, కొత్తకుంట తండాల్లోని వివిధ పార్టీలకు చెందిన దాదాపు 300 మంది నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పోలేపల్లి ఎంపీటీసీ దోనాదుల కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జైపాల్యాదవ్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమైందని..నియోజకవర్గానికి కొత్త బిచ్చగాళ్లు వస్తారని, వారి మాయమాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్, బీజేపీలు ఈ రాష్ర్టానికి చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాతే సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదన్నారు. సంక్షేమ పథకాల అమల్లో దేశాని కే మన రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు.
దేశంలోని బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలు కూడా ఇక్క డ అమలవుతున్న పథకాలను కాపీ కొడుతున్నాయని పేర్కొన్నారు. ఇంటింటికీ అందుతున్న సంక్షేమ పథకా లు, అభివృద్ధి పథకాలతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. రైతుబంధు ద్వారా ఇప్పటివరకు రూ. 75 వేల కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసినట్లు ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా రైతుబీమా ద్వారా రైతు ఏ కారణంగానైనా మృతి చెందితే అ తడి కుటుంబానికి రూ.ఐదు లక్షల చెక్కును ప్రభుత్వం అందించి ఆదుకుంటున్నదన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల క్రింద ఇప్పటివరకు రూ. 15 వేల కోట్లు, 13 లక్షల మం దికి కేసీఆర్ కిట్లు సర్కారు అందించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు స్కీములను ప్రజలు నమ్మొద్దన్నారు. త్వరలో జరుగనున్న ఎన్నికల్లో పనిచేసే ప్రభుత్వానికే అండగా ఉండాలని ఆయన సూచించారు. ఎవరెన్ని కుట్రలు, కుత్రంతాలు చేసినా కల్వకుర్తిలో గులాబీ జెండా ఎగురడం ఖాయమన్నారు. నక్సల్స్ దాడి చేసినా నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతోనే బతికానన్నారు. అనంతరం గోలి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ పదేండ్ల కాలంలో ఇంటింటికీ, ప్రతి గ్రామానికీ సంక్షేమ పథకాలను చేర్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. సీఎం తీసుకుంటున్న చర్యలతో దేశంలోని ఇతర రాష్ర్టాలకంటే తెలంగాణ అన్ని రంగాల్లో ముందుందన్నారు. ఎమ్మెల్యే జైపాల్యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
సింగంపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు బోడిగల సైదులు గుండెపోటుతో మృతి చెందగా.. విష యం తెలుసుకున్న ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ఆ గ్రామానికెళ్లి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబానికి అండంగా ఉంటానని హమీ ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి ,బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అర్జున్రావు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ సత్యం, జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు పత్యానాయక్, సర్పంచ్ శ్రీనయ్య, బీఆర్ఎస్ మైనార్టీ విభాగం సీనియర్ నాయకులు సయ్యద్ ఖలీల్, నాయకులు చందూనాయక్, జాన్యానాయక్, పరమేశ్, ప్రసాద్, కిరణ్, సతీశ్, వెంకటయ్య, కృష్ణ, శివ, శ్రీరామ్, గణేశ్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజకీయ పరిజ్ఞానం, అవగాహన, విలువలుంటే తక్షణమే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ నమ్మకంతో రెండుసార్లు ఎమ్మెల్సీగా అవకాశమిస్తే కన్నతల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన నాయకుడంటూ మండిపడ్డారు. ఇలాంటి నాయకులకు ప్రజాక్ష్రేతంలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు.
మర్పల్లి, అక్టోబర్ 11 : బీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం మండలంలోని వీర్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు భీమయ్య, యాకుబ్, బీజేపీ నాయకులు సంజీవులు, వెంకటేశ్తోపాటు దాదాపుగా ఆ రెం డు పార్టీలకు చెందిన 50 మంది నాయకులు, కా ర్యకర్తలు సర్పంచ్ సుధాకర్రెడ్డి ఆధ్వర్యంలో వికారాబాద్లో ఎమ్మెల్యే ఆనంద్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ సీఎం కేసీఆర్తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమన్నా రు. ఇంటింటికీ అందుతున్న పథకాలతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేసి మూడోసారి సీఎం కేసీఆర్ను, రెండోసారి ఎమ్మెల్యేగా ఆనంద్ను గెలిపించుకుందామని జడ్పీటీసీ మధుకర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, గ్రామాధ్యక్షుడు వీరన్నపాల్గొన్నారు.
షాద్నగర్, అక్టోబర్11: తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ బీఆర్ఎస్ అని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. బుధవారం కొత్తూరు మండలంలోని ఇన్ముల్నర్వ గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగుతున్నదని.. అన్ని వర్గాల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకుని ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని కొనియాడారు. నేడు గ్రామాలు అభివృద్ధి పథంలో ముందున్నాయంటే అందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలేనని పేర్కొన్నారు. పేదలు బాగుపడాలన్న, సర్కారు పథకాలు ఇంటింటికీ చేరాలన్నా బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. ప్రతిపక్షాలు చెప్పే హామీలను నమ్మొద్దని.. ప్రజల బాగు కోరే బీఆర్ఎస్ను త్వరలో జరుగనున్న ఎన్నికల్లో గెలిపించాలని సూచించారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు యాదగిరి, నాయకులు రషీద్, అయూబ్, అజయ్కుమార్, భరత్, అనిల్, సందీప్, జయం త్, చందు, నరేశ్, రాజు, మధు, చారి, రాకేశ్, మహేశ్, రవి పాల్గొన్నారు.
తాండూరు రూరల్, అక్టోబర్ 11 : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని అంతారం గ్రామానికి చెందిన 100 మంది గ్రామస్తులు, యువకులు సర్పంచ్ రాములు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రోహిత్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఇంటింటికీ సంక్షేమ పథకాలను అందించి ఆదుకుంటున్నదన్నారు. త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రోహిత్రెడ్డి విజాయానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.