కొడంగల్, నవంబర్ 28 : సంక్షేమ పథకాలను అందుకోవాలంటే.. కేసీఆర్ సీఎం కావాలని, కాంగ్రెస్కు ఓటేస్తే.. ఆగం కాక తప్పదని వైద్యా రోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. మం గళవారం నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూర్ మండలంలో ఎన్నికల ప్ర చారంలో భాగంగా మంత్రి రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాతే సాధించుకున్న తెలంగాణలో సంక్షేమం, అభివృ ద్ధి జాతర కొనసాగుతుందన్నారు. రూ.కోట్లాది నిధులతో తెలంగాణ అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే.. ఆ గం కాక తప్పదని, గతంలోని 50 ఏండ్ల పాలనే అందుకు నిదర్శనంగా పేర్కొన్నారు.
గతంలో పదేండ్లు కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్రెడ్డి గుడి కట్టలేదు.. బడి కట్టలేదన్నారు. కాంగ్రెస్కు అభ్యర్థులే లేరని, రేవంత్ ఎలా సీఎం అవుతాడని ప్రశ్నించారు. సీఎం కావాలంటే ముందు ఎమ్మె ల్యే కావాలని ఎన్నిక ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే గురునాథ్రెడ్డి చెప్పడానికి ఇదే కారణమన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతుబంధు ఖతం, విద్యార్థుల స్కాలర్షిప్లు ఖతం అయ్యాయని మంత్రి హరీశ్రావు అన్నారు. రేవంత్రెడ్డి అధికారంలోకి రాకముందే వ్యవసాయానికి 3 గంటల కరెంటు సరిపోతుందని చెబుతున్నారని, వ్యవసాయానికి 3 గంటల కరెంటు సరిపోతుం దా అని ప్రశ్నించారు.
కేసీఆర్ వచ్చాకే తండాలు జీపీలుగా మారాయని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. సచివాలయానికి అంబేద్కర్ పేరుతో పాటు అంబేద్కర్ విగ్ర హం, దొంగ కరెంటు పోయి 24 గంటల కరెం టు, తాగునీటి కష్టాలు పోయి మిషన్ భగీరథ ప థకంతో ఇంటి ముందు స్వచ్ఛమైన కృష్ణాజలా లు, కోటి ఎకరాల మాగాణి, పేదింట్లో కల్యాణల క్ష్మి కాంతులు, కేసీఆర్ కిట్, హైదరాబాద్ కీర్తి ప్ర పంచ వ్యాప్తి, రైతుబంధు, రైతుబీమాతో అన్నపూ ర్ణ రాష్ట్రంగా తెలంగాణ, గతంలో నేను రానుబిడ్డో సర్కారు దవాఖానకు అని ఉండగా నేడు పోదాం పద సర్కారు దవాఖానకు వంటి ఎన్నో అద్భుతాలు ఏర్పడం మార్పు కాదా అని ప్రశ్నించారు.
పట్నం నరేందర్రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మ ద్దూర్ను మున్సిపాలిటీగా, మద్దూర్ మండల కేం ద్రంలో రోడ్డు వెడల్పుతో పాటు స్ట్రీట్లైట్లతో సుందరీకరణ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. స్థానికం గా ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా దౌల్తాబాద్ ప్రాంతంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏ ర్పాటు, నియోజకవర్గంలో డివిజన్ డివిజన్ కేం ద్ర ఏర్పాటు చేస్తాన్నారు. బీఆర్ఎస్ను గె లిపిస్తే.. సీఎం కేసీఆర్ కాళ్లు పట్టుకోనైనా సరే కొ డంగల్కు ప్రమోషన్ ఇప్పిస్తానని హామీ ఇచ్చా రు.
అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడిన సీఎం కేసీఆర్కు పెద్ద మెత్తంలో ప్రజాదరణ ఉందని, హ్యాట్రి క్ సీఎంగా కేసీఆర్ చరిత్రను సృష్టించనున్నట్లు మంత్రి పట్నం మహేందర్రెడ్డి తెలిపారు. నియో జకవర్గంలో చేపట్టిన అభివృద్ధిని ఎమ్మెల్యే నరేం దర్రెడ్డి వివరించారు. మరోసారి గెలిపిస్తే మరిం త అభివృద్ధి చేస్తానన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కమీషన్ డైరెక్టర్ సలీం, మాజీ జడ్పీటీసీ బాల్సింగ్, కోస్గి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వీరారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ జగదీశ్వర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకటయ్య, స ర్పంచ్ అరుణ, పార్టీ నాయకులు పాల్గొన్నారు.