షాద్నగర్రూరల్, డిసెంబర్ 6 : ప్రజలకు మరింత చేరువై వ్యాధుల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు వైద్య సిబ్బందికి సూచించారు. షాద్నగర్ డివిజన్లోని అన్ని ప్రాథమిక కేంద్రాలలోని ఏఎన్ఎంలకు షాద్నగర్ డిప్యూటీ డీఎంఅండ్హెవో డాక్టర్ జయలక్ష్మి ఆధ్వర్యంలో మంగళవారం ఏఎన్ఎంలకు నిర్వహించిన సీపీహెచ్సీ శిక్షణ తరగతులకు ఆయన హాజరై మాట్లాడారు. పాలిటేటివ్ కేర్పై గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రధానంగా వృద్ధులు, అనాధల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ్ద తీసుకోవాలన్నారు. ప్రజలకు క్షేత్ర స్థాయిలో వైద్య సేవలను అందించేందుకు ఏఎన్ఎంలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్ వైజర్లు లత, ప్రమీల, స్వరాజ్యలక్ష్మి, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు, అప్తాల్మిక్ అధికారి శ్రీహరి, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
ఏఎన్ఎం కమలమ్మకు 60 వేల సాయం
కొత్తూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎం కమలమ్మ భర్త ఇటీవలే గుండె నొప్పితో మృతి చెందాడు. కమలమ్మ నిరుపేదరాలు కావడంతో తోటి సిబ్బంది రూ.60 వేలు పోగు చేసి కమలమ్మకు జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు. వైద్యాధికారి కూడా రూ.5 వేలు అందజేశారు.