మండే ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు యువకులు, పెద్దలు చెక్డ్యాంలు, చెరువులు, బావుల్లోని నీళ్లలో ఈత కొడుతూ సేదతీరుతున్నారు.
చేవెళ్లకు చెందిన పలువురు యువకులు మధ్యాహ్నం సమయంలో ఎండ వేడి, వడగాల్పుల నుంచి ఉపశమనం పొందేందుకు ఇలా స్నేహితులతో కలిసి బావిలోని నీటిలో ఈత కొట్టారు.