కొన్ని దశాబ్దాలుగా తీరని సమస్యగా ఉన్న 111 జీవోను ఎత్తివేసినందుకు ఆ జీవో పరిధిలోకి వచ్చే ప్రాంతాల ప్రజాప్రతినిధులు సోమవారం సచివాలయంలో సీఎం కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం తదితరులు సీఎంను కలిసినవారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 111 జీవో ఎత్తివేతతో 84 గ్రామాల ప్రజలకు ఎంతో మేలు చేకూరనున్నదన్నారు.