ధారూరు, జనవరి 2 : పేదలకు మెరుగైన పేవలందించేందుకు జిల్లా న్యాయ సేవా సంస్థల సేవలను ప్రారంభించినట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల భుయాన్ అన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 23జిల్లాల్లో జిల్లా న్యాయసేవా అధికార సంస్థలు ప్రారంభోత్సవంలో భాగంగా తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్వలభూయన్ ఆధ్వర్యంలో జిల్లా న్యాయసేవ అధికార సంస్థల వర్చువల్ విధానంలో ఉదయం లాంఛనంగా ప్రారంభించారు.
అనంతరం వికారాబాద్ జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన లీగల్ సర్వీస్ భవనాన్ని వికారాబాద్ జిల్లా ప్రధాన న్యాయ మూర్తి కె.సుదర్శన్ ప్రారంభించారు. సీనియర్ న్యాయమూర్తి డీబీ శీతల్ను జిల్లా న్యాయసేవ సెక్రటరీగా నియమించారు. జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్మన్ మాట్లాడుతూ జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ద్వారా పేదలకు ఉచిత న్యాయ సేవా దొరుతుందన్నారు. అలాగే నూతన జిల్లాలు ఏర్పడక ముందు మండల న్యాయసేవ ఉండేదని, దాని ద్వారా కొంత పరిమితిలో ఉన్న కేసులు మాత్రమే చూసేందుకు ఉండేదన్నారు.
ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చూసే అవకాశం ఈ న్యాయసేవా ద్వారా చూడవచ్చన్నారు. సమస్యలను జిల్లా న్యాయసేవా ద్వారా అధికార సంస్థలో అప్పీలు పెట్టుకుంటే నోటీసు ద్వారా ఇరు పార్టీలను పిలిచి మాట్లాడనున్నట్లు తెలిపారు. ఇరు పార్టీల మధ్య రాజీ కుదరకుంటే, సమస్య పరిష్కారం కాని పక్షంలో తిరిగి కోర్టుకు వెళ్లి కేసు వేసుకోవచ్చని తెలిపారు. ఈ న్యాయ సేవ సంస్థల ద్వారా గ్రామీణుల్లో చట్టాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి న్యాయమూర్తి శ్రీకాంత్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి శృతిదూత, జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, వికారాబాద్ బార్ ప్రెసిడెంట్ మాధవరెడ్డి, ఉపాధ్యక్షుడు డి.లక్ష్మణ్, సెక్రటరీ జగన్, న్యాయవాదులు గోపాల్రెడ్డి, కమల్రెడ్డి, సంపూర్ణా ఆనంద్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.