ధారూరు, జనవరి 11: తెలంగాణ పచ్చబడాలే.. చెట్లు లేక బోసిపోయిన పల్లెలు, పట్టణాల్లో పచ్చదనం వెల్లివిరియాలే.. పరాయి పాలనలో నిర్జీవంగా మారిన అడవులకు పునరుజ్జీవం పోయాలే.. పర్యావరణ పరిరక్షణలో రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలపాలే..’ అని చెప్పిన సీఎం కేసీఆర్, అదే సంకల్పంతో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించి కోట్లాది మొక్కలకు ప్రాణం పోస్తున్నారు. ఇప్పటికే ఎనిమిది విడుతలను వికారాబాద్ జిల్లాలోని అధికారులు, ప్రజాప్రతినిధులు విజయవంతం చేశారు. కాగా మండలంలోని అధికారులు, ప్రజాప్రతినిధులు పచ్చదనం పరిఢవిల్లేలా మొక్కలను నాటి సంరక్షణకు చర్యలు చేపట్టారు.
గత జూలైలో ముగిసిన ఎనిమిదో విడుతలో ఇంటింటికీ ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేయడంతోపాటు ప్రతి ఒక్కరూ నాటేలా చొరవ తీసుకున్నారు. రానున్న హరితహారం కార్యక్రమానికి సంబంధించి ఇప్పటి నుంచే మొక్కల పెంపకానికి అధికారు లు చర్యలు తీసుకుంటున్నారు. మం డలంలోని 32 పంచాయతీల్లోని హరితహారం నర్సరీల్లో మొక్కలకో సం విత్తనాలు, ప్లాస్టిక్ బ్యాగులు, కవ ర్లను సిద్ధం చేసి వాటిలో మట్టిని నింపే కార్యక్రమాన్ని ము మ్మరంగా చేపడుతున్నారు. ప్రతి నర్సరీలోనూ ఐదు వేలకు తగ్గకుండా మొక్కలను పెంచి రానున్న హరితహారానికి సిద్ధం చేస్తున్నారు.
గ్రామాల వారీగా బ్యాగుల సంఖ్య ఇలా..
మండలంలో 32 గ్రామ పంచాయతీలుండగా…అల్లాపూర్ 5,000 బ్యాగులు, అల్లీపూర్లో 5,200, అంతారంలో 5,600, అంపల్లిలో5,530, చింతకుంటలో 6,800, ధర్మాపూర్లో 6,000, ధారూరులో 6,500, స్టేషన్ధారూరు లో 7,000, దోర్నాల్లో 6,000, ఎబ్బనూర్లో 6,250, గడ్డమీదిగంగారంలో 4,500, గట్టేపల్లిలో 6,000, గురుదోట్లలో 5,200, హరిదాస్పల్లిలో 6,000, కెరెళ్లిలో 7,000, కొండాపూర్కలాన్లో 4,860, కుక్కిందలో 4,200, కుమ్మరిపల్లిలో 4,500, మోమిన్కలాన్లో 6,000, మోమిన్ఖుర్దులో 5,500, మున్నూర్సోమారంలో 6,500, మైలారం లో 2,500, నాగారంలో 5,8 00, నాగసముందర్లో 5,000, నాగుసాన్పల్లిలో 5,450, నర్సాపూర్లో 5,000, అవుసులపల్లిలో 5,700,పులిచింతల మడుగుతండాలో 5,000, రాజాపూర్లో 5,500, రాంపూర్తండాలో 6,500, రుద్రారంలో 5,700, తరిగోపులలో 5,5 80 బ్యాగుల మొక్కలను గ్రామ నర్సరీల్లో పెంచేందుకు సిద్ధం చేశారు.
ఈ కార్యక్రమం ఎంతో బాగున్నది
రాష్ట్రంలో చెట్లు పూర్తిగా అంతరించిపోతున్న విషయాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీంతో రైతులు తమ, తమ పొలాల వద్ద, ఇంటి పరిసరాలు, రోడ్లకు ఇరువైపులా మొక్కలను నాటుతున్నారు. గత ఎనిమిది విడుతలుగా జరిగిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా లక్షలాది మొక్కలను నాటడంతో పచ్చదనం పరిఢవిల్లుతున్నది. ఎటు చూసినా పచ్చదనం సంత రించుకున్నది . – శ్రీధర్ గౌడ్,
రైతు నాగారం, ధారూరు మండలం
రెండు సార్లు నీటిని అందిస్తున్నాం
గ్రామ నర్సరీల్లో మొక్కలు ఎండిపోకుండా ప్రతిరోజూ రెండుసార్లు నీటిని అందించే ఏర్పాట్లు చేశాం. హరితహారంలో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షిస్తున్నాం. రానున్న వర్షాకాలానికి లక్ష్యం మేర మొక్కలను సిద్ధం చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
– శ్రీనివాస్, టీఏ
ఉపాధి హామీ పథకం, ధారూరు మండలం
మొక్కల పెంపకానికి చర్యలు
రానున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో 1.8 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచి మండలంలోని అన్ని గ్రామాల్లో మొక్కల పెంపకానికి చర్యలు తీసుకుంటున్నాం. ప్రతిరోజూ మొక్కలకు రెండు సార్లు నీటిని అందిస్తూ ఎండిపోకుండా చూస్తున్నాం.
– సురేశ్కుమార్, ఏపీవో ధారూరు మండలం