పరిగి, నవంబర్ 23:హరితహారంలో భాగంగా ఈసారి ప్రతి గ్రామ పంచా యతీలో 4500 మొక్కలు పెంచాలని నిర్దేశించినట్లు పరిగి ఎంపీపీ కరణం అరవిందరావు పేర్కొన్నారు. మొక్కల పెంపకానికి సంబంధించిన ప్లాస్టిక్ బ్యాగులను బుధవారం ఎంపీపీ అరవిందరావు గ్రామపంచాయతీ కార్యద ర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లా డుతూ ఈనెల 25వ తేదీ లోపు మట్టి సమకూర్చుకొని మొక్కల పెంపకం పనులు ప్రారంభించాలని చెప్పారు. మేలిమి రకాలైన విత్తనాలు నాటడం ద్వారా చక్కటి మొక్కలు వస్తాయని అన్నారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ డీవో శేషగిరిశర్మ, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు మేడిద రాజేం దర్, ఎంపీవో దయానంద్, పీఏసీఎస్ డైరెక్టర్ భోజ్యనాయక్, ఏపీవో ఉష, ఈసీ ప్రభాకర్, గ్రామపంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.