బీఆర్ఎస్ పొలిట్ బ్యూరో మాజీ సభ్యుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ ఉప సభాపతి కొప్పుల
హరీశ్వర్రెడ్డి ద్వాదశ దినకర్మ పరిగిలో మంగళవారం జరిగింది. మంత్రులు మహేందర్రెడ్డి, సబితారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, ఎంపీలు జి.రంజిత్రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాలె యాదయ్యతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఘనంగా నివాళులర్పించారు. హరీశ్వర్రెడ్డి సతీమణి గిరిజాదేవి, ఎమ్మెల్యే మహేశ్రెడ్డి, అనిల్రెడ్డిలను పరామర్శించారు.
– పరిగి, అక్టోబర్ 3
పరిగి, అక్టోబర్ 3 : బీఆర్ఎస్ మాజీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ ఉప సభాపతి కొప్పుల హరీశ్వర్రెడ్డికి పలువురు ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం ద్వాదశ దినకర్మ సందర్భంగా పరిగిలో హరీశ్వర్రెడ్డి చిత్రపటానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి, రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి , రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, చేవెళ్ల, జహీరాబాద్ ఎంపీలు జి.రంజిత్రెడ్డి, బీబీపాటిల్, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పి.
నరేందర్రెడ్డి, పైలట్ యాదయ్య, అంజయ్యయాదవ్, మాగంటి గోపీనాథ్, రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, యాదాద్రి భువనగిరి జడ్పీచైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, మహబూబ్నగర్ ఎంపీలు మంద జగన్నాథం, కొండా విశ్వేశ్వర్రెడ్డి, జితేందర్రెడ్డి, రావుల చంద్రశేఖర్రెడ్డి, మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్పీ కోటిరెడ్డి, బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు భూపాల్రెడ్డి, సుధాకర్రెడ్డి, కర్నె ప్రభాకర్, యాదవరెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు హరీశ్వర్రెడ్డి చిత్రప టం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరీశ్వర్రెడ్డి సతీమణి గిరిజాదేవిని మంత్రి సబితారెడ్డి పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి, అనిల్రెడ్డిలను పరామర్శించారు. పరిగి సెగ్మెంట్తోపాటు ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల నుంచి వేలాది మంది అభిమానులు హాజరై హరీశ్వర్రెడ్డికి నివాళులర్పించారు.