కట్టంగూర్, ఆగస్టు 08 : శ్రీ హరికృష్ణ గొర్రెల పెంకందారుల కట్టంగూర్ నూతన కమిటీని శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎన్నికల అధికారి కత్తుల లక్ష్మి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ముక్కామల వెంకటేష్, ఉపాధ్యక్షుడిగా గట్టిగొర్ల శ్రీకాంత్, కార్యదర్శిగా సుంకరబోయిన గంగాధర్, సభ్యులుగా అల్లి మల్లేశ్, ముక్కామల సత్తెమ్మ, ముక్కామల అనిత ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ సుంకరబోయిన నర్సింహ్మ మాట్లాడుతూ.. గొర్రెల పెంకందారుల సమస్యలు పరిష్కరిస్తూ సంఘం బలోపేతానికి నూతన కమిటీ కృషి చేయాలని సూచించారు. అనంతరం నూతన కమిటీని గొర్రెల పెంకందారులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్, మాజీ ఎంపీటీసీ గట్టిగొర్ల సత్తయ్య, నాయకులు ముక్కామల యాదయ్య, ముక్కామల మల్లయ్య, వెంకన్న, అంజయ్య, సుంకరబోయిన యల్లయ్య, శంకర్, సైదులు, రాములు, గట్టిగొర్ల గంగరాజు, తొట్ల రవి, జాని, యల్లేష్ పాల్గొన్నారు.