Kodangal | కొడంగల్, ఫిబ్రవరి 11 : కొడంగల్కు ప్రభుత్వ మెడికల్ కళాశాలను మంజూరు చేస్తూ జీవో నం. 6ను సర్కార్ విడుదల చేసింది. ప్రభుత్వ మెడికల్ కళాశాలకు 50 సీట్లు, నర్సింగ్ కళాశాలకు 60 సీట్లు, ఫిజియోథెరఫీ కళాశాలకు 50సీట్లు కేటాయించడంతోపాటు కొడంగల్ సీహెచ్సీ ఆసుపత్రిని 50 పడకల నుంచి 220 పడకల ఆసుపత్రితో పాటు టీచింగ్ ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తున్నట్లు జీవోలో పొందుపర్చింది. ఇందుకు 22,450కోట్లు నిధులు వెచ్చించనున్నటు జీవోలో తెలిపింది.
మెడికల్ కళాశాల ఏర్పాటుపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి సీఎం కావడంతో కొడంగల్ దిశ, దిశ మారుతుందని, ఇదివరకే కోస్గి మున్సిపల్లో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటైనట్లు అధికారులు తెలిపారు. కొడంగల్లో మెడికల్ కళాశాల ఏర్పాటుతో పాటు కొడంగల్లోని ప్రభుత్వ ఆసుపత్రిని 220 పడకలుగా అప్గ్రేడ్ చేయడంతో పాటు మెరుగైన వైద్యం అందించేలా కృషి చేస్తున్న సీఎం రేవంత్రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.