చేవెళ్ల రూరల్, ఆగస్టు 5 : క్రీడల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధన్యమిస్తున్నది. ప్రతి గ్రామంలో ఎకరం స్థలం కేటాయించి క్రీడా మైదానాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. శుక్రవారం చేవెళ్ల మండల పరిధి పామెన గ్రామంలోరాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రీడామైదానాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత క్రీడల్లో రాణించేందుకు ఎకరం స్థలంలో క్రీడా మైదానాలను ఏర్పాటు చేస్తుందన్నారు. యువత క్రీడా మైదనాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అనంతరంహరితహారం కార్యక్రమంలో భాగంగా క్రీడా ప్రాంగణం చుట్టూ మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, వైస్ ఎంపీపీ శివ ప్రసాద్, సర్పంచ్ మల్లారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మిట్ట వెంకటరంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.