కందుకూరు, జూన్ 26 : గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని దావుద్గూడ పల్లె నిద్ర కార్యక్రమంలో ఇచ్చిన హమీలను నెరవేరుస్తున్నట్లు ఆమె తెలిపారు.
గ్రామస్తులకు ఇచ్చిన హమీ మేరకు అంగన్ వాడీ భవనంతో పాటు 10లక్షల రూపాయలతో సీసీ రోడ్డును మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడంతో గిరిజనులు మంత్రి నివాసానికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..గిరిజనులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. వారిని అన్ని విధాలుగా ఆదుకోవడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు చెప్పారు.
ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ సమస్యలను తెలుసుకొని అధికారంలోకి వచ్చిన అనంతరం అములు చేస్తున్నట్లు తెలిపారు. 500 జనాభా ఉన్న తండాలను గుర్తించి ప్రత్యేక పంచాయతీలుగా గురించడంతో తండాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు.