నందిగామ,జనవరి12 : పాడి రైతులు అర్థికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. వర్షాధారిత ప్రాంతం అభివృద్ధి పథకం ద్వారా మంజూరైన 20 యూనిట్ల ఆవులను బుధవారం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందన్నారు. ఇప్పటికే రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంటు వంటి పథకాలతో పాటు పాడి పరిశ్రమలో రైతులకు సబ్సిడీపై ఆవులు, బర్రెలు ఇవ్వడం పాలకు మద్దతు ధర కల్పించడం వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరు ప్రభుత్వ పథకాలు అందుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.. నందిగామ మండలంలో ఉత్తమ రైతులుగా ఎంపికైన జిల్లెల్ల బాల్రెడ్డి, భాస్కర్రెడ్డి, చేగూరు గ్రామానికి చెందిన యాదయ్యలను ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ శాలువతో సన్మానించి, మెమోంటోను అందజేశారు. సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.