ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 1 : మన ఊరు-మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టిందని, కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో బోధన ఉంటున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని శేరిగూడ ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సామాన్యులకు నాణ్యమైన విద్యను అందించాలనే ప్రభుత్వం కోట్లాది రూపాయలను కేటాయించి మన ఊరు-మనబడి కార్యక్రమం కింద పాఠశాలల్లో 12 రకాల మౌలిక వసతులను కల్పించిందన్నారు. నియోజకవర్గంలో సుమారు 65 పాఠశాలలను మొదటి విడుతలో తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి, ఎంపీపీ కృపేశ్, మున్సిపల్ వైస్ చైర్మన్ యాదగిరి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్, కౌన్సిలర్లు సుధాకర్, యాచారం సుజాత, జ్యోతి, ప్రసన్నలక్ష్మి, జగన్, విశాల, బాలరాజు, భానుబాబు, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మొద్దు అంజిరెడ్డి పాల్గొన్నారు.
విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట -ఎమ్మెల్యే జైపాల్యాదవ్
కడ్తాల్ : రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో పాఠశాలలకు మహర్దశ పట్టనుందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని సాలార్పూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో రూ.16.22 లక్షలతో నిర్మించిన తరగతి గది, టేబుల్స్, ఫ్యాన్లు, నీటి ట్యాంక్, మరుగుదొడ్లు, ప్రహరీని సర్పంచ్ విజయలక్ష్మి, ఎంపీటీసీ ప్రియతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో మొదటి విడుతలో 108 పాఠశాలలు ఎంపికయ్యాయని, ఆయా పాఠశాలలో 12 రకాల పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు.అదే విధంగా చల్లంపల్లి గ్రామం నుంచి సాలార్పూర్ మీదుగా పడకల్ గేట్ వరకు రోడ్డు మరమ్మతుల కోసం రూ.60 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు.
అంతకుముందు చల్లంపల్లి గ్రామంలో రూ.20 లక్షలతో చేపట్టిన గ్రామ పంచాయతీ భవనం, రేఖ్యాతండా గ్రామ పంచాయతీ పరిధిలోని టాక్రాజ్గూడ తండాలో రూ.10 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్లు కృష్ణయ్య, హరిచంద్నాయక్, ఉప సర్పంచ్లు జైపాల్రెడ్డి, శ్రీశైలం, ముత్యాలు, జగన్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు వీరయ్య, ఏంఈవో సర్దార్నాయక్, ఎంపీడీవో రామకృష్ణ, హెచ్ఎం ఖలీల్అహ్మద్, ఏఎంసీ చైర్మన్ బాబా, నాయకులు శంకర్నాయక్, రమేశ్నాయక్, పంత్యానాయక్, ప్రకాశ్నాయక్, సాయిలు, కొమురయ్య, రాజేందర్యాదవ్, బిక్షపతి, సీడీపీవో సక్కుబాయి, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
సంపూర్ణ అక్షరాస్యత సాధనే లక్ష్యం -ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
షాద్నగర్రూరల్ : సంపూర్ణ అక్షరాస్యత సాధనతోనే రాష్ర్టం మరింత పురోగతి సాధిస్తుందని, సర్కారు విద్యకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఫరూఖ్నగర్ మండలంలోని గంట్లవెల్లి, రాయికల్ గ్రామాల్లో మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫరూఖ్నగర్ మండలంలోని మను ఊరు-మన బడి, మన బస్తి-మన బడి పథకం కింద 34 పాఠశాలలు ఎంపికయ్యాయని తెలిపారు. లక్షలాది రూపాయలతో ప్రతి బడిలో అన్ని వసతులను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాయికల్ ప్రాథమిక పాఠశాలకు రూ.24 లక్షలు, గంట్లవెల్లి ప్రాథమికోన్నత పాఠశాలకు రూ.18 లక్షలతో విద్యార్థులకు వసతులను సమకూర్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, ఎంపీడీవో వినయ్కుమార్, మండల విద్యాధికారి శంకర్రాథోడ్, సర్పంచ్లు యాదమ్మ, కృష్ణయ్య, రామేశ్వరం సర్పంచ్ సంపత్కుమార్, హెచ్ఎం కృష్ణయ్య పాల్గొన్నారు.