కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని ముద్విన్ గ్రామానికి చెందిన మంగమ్మకి రూ. 26000, నర్సింహాకి రూ. 35000, మాడ్గుల్ మండలం చంద్రాయన్పల్లి గ్రామానికి చెందిన బలరాంకి రూ. 20000 సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయి. శనివారం ఎమ్మెల్యే హైదరాబాద్లోని తన నివాసంలో లబ్ధిదారులకు నాయకులతో కలిసి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేదలకందరికీ వరంలా మారిందని తెలిపారు.
నిరుపేదలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారని ఆయన చెప్పారు. కార్యక్రమంలో ఎంపీటీసీ జైపాల్రెడ్డి, ఉప సర్పంచ్ వినోద్, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు జంగయ్యయాదవ్, నాయకులు గోపాల్, శ్రీనివాస్ పాల్గొన్నారు.