మహేశ్వరం, ఆగస్టు 4: కుల వృత్తులకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం తుక్కుగూడ మున్సిపాలిటీ రావిరాలకు చెందిన ఎరుకల సంఘం వారికి పందుల పెంపకానికి స్థలం కేటాయించాలని కోరుతూ.. ఎరుకల సంఘం మున్సిపాలిటీ అధ్యక్షుడు జెల్లల లక్ష్మయ్యతో కలిసి సభ్యులు మంత్రికి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తున్నారని ఆమె తెలిపారు. తెలంగాణలో ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా ప్రతి గడపకు చేరుతున్నాయని పేర్కొన్నారు.
ఎరుకల కుల వృత్తుల వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని ఆమె అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాట సురేశ్, మాజీ ఎంపీటీసీ లింగం, సురేశ్, ఎరుకల నాగేశ్గౌడ్, పొట్టల నరసింహ, గోనేమోని శివశంకర్, నవీన్, శ్రీకాంత్ ఎరుకల సంఘం సభ్యులు సురేశ్, ప్రభాకర్, యాదయ్య, కృష్ణ పాల్గొన్నారు.