శంకర్పల్లి : సీఎం కేసీఆర్ ప్రభుత్వ దవాఖానాల బలోపేతానికి కృషి చేస్తున్నారని చేవేళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యలతో కలిసి సోమవారం శంకర్పల్లి ఏఎంసీ రోడ్డులో శ్రీ డయాగ్నస్టిక్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత సంవత్సరం రాష్ట్రంలోని 19 దవాఖానాలలో 50రకాల వైద్య పరీక్షలు చేసుకోవడానికి సౌకర్యాలు కల్పించారన్నారు.
పేద ప్రజలు ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొన్ని దవాఖానాలలో సీటీ స్కాన్ సౌకర్యాలు కల్పించాలన్నారు. వికారాబాద్, సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానాలలో సీటీ స్కాన్ చేసుకునే సౌకర్యం ఉందన్నారు. ప్రైవేటులో ఈ వైద్య పరీక్షలకు ఐదారువేలు అవుతుందని తెలిపారు. కాగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలలో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పారు.
కార్యక్రమంలో ఎంపీపీ డీ.గోవర్ధన్రెడ్డి, జెడ్పీటీసీ గోవిందమ్మ, మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి, వైస్ చైర్మన్ బీ.వెంకట్రాంరెడ్డి, స్థానిక పీఏసీఎస్ చైర్మన్ బద్దం శశిధర్రెడ్డి, మండల, మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కే.గోపాల్ తదితరులు పాల్గొన్నారు.